Mahesh Babu: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం లో కొత్త రికార్డులు సృష్టించడం లో సూపర్ స్టార్ మహేష్ స్టైలే వేరు. తన ప్రతి సినిమాతో వైవిధ్యంగా ఆడియన్స్ ని అలరిస్తూ మరోపక్క సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తండ్రికి తగ్గ రీతిలోనే మహేష్ కొడుకు గౌతమ్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విషయంలోకి వెళితే 2018 వ సంవత్సరం నుండి స్విమ్మింగ్ లో గౌతమ్ ప్రాధాన్యత పొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన వయసు వారితో ఇటీవల పోటీపడి తెలంగాణలో టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తెలియజేసింది. తల్లిదండ్రులు గర్వ పడే రీతిలో కొడుకు గౌతమ్ సంతోషింప చేశాడని .. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టాప్ స్విమ్మర్ గా నిలిచాడని పేర్కొంది. గౌతం ఎంతో కష్టపడి చాలా టెక్నిక్ గా నిర్ధేశించిన రీతిలో ఖచ్చితమైన వేగంతో గమ్యస్థానానికి చేరుకున్నాడు అని తెలిపింది. ముఖ్యంగా ఈ గేమ్ లో బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీస్టయిల్ అలవోకగా ఈదుతూ.. ఎక్కువగా ఫ్రీస్టైల్ లో చాలా ప్రొఫెషనల్ అయిపోయాడని.. కొడుకు గౌతమ్ గొప్పదనం గురించి నమ్రత చెప్పుకొచ్చింది.
Read More: Mahesh Babu: మరోసారి నెంబర్ వన్ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!!
ఫ్రీస్టయిల్ లో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు గంటల్లో గౌతం చేరుకోగల నైపుణ్యాన్ని రాబట్టాడు అని ఎంతో ఆనందంగా ఉంది అంటూ నమ్రత కొడుకు సాధించిన రికార్డు పై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించింది. దీంతో మహేష్ బాబు అభిమానులు కూడా గౌతమ్ సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని చిన్న వయసులోనే.. మహేష్ మాదిరిగానే అనిపించుకుంటున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.