Mahesh Babu in Home Quarantine: సూపర్ స్టార్ మహేష్ బాబు , పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట.. దుబాయ్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇటీవల రెండో షెడ్యూల్ ను ప్రారంభించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెట్లో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కి కరోనా సోకినట్లు తెలిసిన వెంటనే మహేష్ బాబు కుటుంబం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.
మహేష్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ తోపాటు సర్కారు వారి పాట యూనిట్లో మరో నలుగురు సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా.. మహేష్ బాబు కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ అయినా జి ఎం బి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.