Mahesh Babu: కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తుంది.. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతున్నాయి.. అన్ని రంగాలతో పాటు సినీ రంగం పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గట్టిగానే చూపిస్తుంది.. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సినీవర్గాలు చెబుతున్నప్పటికీ.. చిత్ర పరిశ్రమలోని కార్మికులు, ఇతర యూనిట్ వర్గాలు, సెలబ్రెటీలు మహమ్మారి బారిన పడుతున్నారు.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.. సినిమా షూటింగ్ ప్రారంభం చేసి వారం రోజులు గడవక ముందే యూనిట్లో ఐదుగురుకి కరోనా సోకింది..
షూటింగ్ మొత్తం ఆపేసి అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లినట్లు సమాచారం.. దీంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.. ఇది మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం ఎప్పుడో చూడాలి మరి.. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎన్.బి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్..