‘మహానటి’ సినిమా లేకపోయి ఉంటే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ అయ్యేదో లేదో తెలియదు కానీ ఆ సినిమాకు వచ్చిన పేరు మాత్రం ఆమెకు అంత కొద్ది సమయంలో వచ్చే అవకాశమే లేదు అన్నది సినీ పండితులు మాట. ఆ సినిమా తర్వాత కీర్తి కి ఏకంగా ‘మహానటి’ ఇమేజ్ వచ్చేసింది. ఇక ఆ పాత్రలో నిజంగానే కీర్తి జీవించేసింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో లేదా మహానటి కి ముందు ఎన్నో బయోపిక్ లు వచ్చినా కూడా ఆ రేంజ్ మాత్రం అందుకోలేకపోయాయి. అంతటి పేరు కూడా ఏ హీరోయిన్ కు రాలేదు. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ ఈ సినిమా ద్వారా సొంతం చేసుకోవడం జరిగింది.
ఇప్పుడు కీర్తి సురేష్ తన శరీరాకృతిని తగ్గించుకుని వరుసగా కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కథా పరమైన సినిమాలను కూడా ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఈమె నటించిన సినిమాలు ఈ మధ్యన ఓటిటీలో రిలీజ్ అవుతూ ఉండడంతో ఆమె క్రేజ్ తగ్గుతోందని విమర్శకులకు చెక్ పెట్టే క్రమంలో కీర్తి ఇప్పుడు గ్లామర్ పాత్రలు కూడా పోషించేందుకు రెడీ అయిపోయిందని సమాచారం. అయితే ఇదే సమయంలో నటుడు నరేష్… తన తల్లి, దర్శకురాలు విజయనిర్మల జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే విజయనిర్మల పాత్రకు కీర్తి సురేష్ తగిన హీరోయిన్ అని ఆమెను సంప్రదించారన్న వార్త వచ్చింది.
అయితే ఇంతకు ముందే కీర్తి సురేష్’ మహానటి’ సినిమా తర్వాత వచ్చిన ఆదరాభిమానాలను చూసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి తాను ఇకపై ఏ బయోపిక్ లో నటించను అని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు నరేష్ కు కూడా ఇదే క్రమంలో ‘నో’ చెప్పిందట. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కీర్తి తాను ఎట్టి పరిస్థితుల్లో బయోపిక్ చేసే అవకాశం లేదని ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అని సమాచారం. ఇక మహేష్ సరసన కీర్తి ‘సర్కారు వారి పాట’ లో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు విజయనిర్మల గారి బయోపిక్ నేపథ్యంలో మహేష్ కీర్తి తో తన వంతుగా ఒక మాట చెప్పబోపోతున్నాడని సమాచారం.
స్వయంగా మహేష్ కీర్తి ని కలిసి ఆమెను విజయనిర్మల బయోపిక్ లో నటించేందుకు ఒప్పించేందుకు నిర్ణయించుకున్నాడట. అయితే మహేష్ అభిమానులు మాత్రం సూపర్ స్టార్ రేంజ్ ఏమిటి… వెళ్లి ఒక హీరోయిన్ ని ఇలా అడగడం ఏమిటి అని సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. కీర్తి పెద్ద నటి అయినా కూడా బాబు రేంజ్ వేరు అన్నది వారి వాదన. మరి మహేష్ ఫ్యాన్స్ మాట వింటాడా లేదా తనకు నచ్చిన పని చేస్తాడా అన్నది వేచి చూడాలి.