సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా 26 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలతో విపరీతమైన దూకుడు మీదున్న మహేష్ తన స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ అభిమానులకు ఇప్పటికైతే ఎటువంటి ఆందోళన లేదు. మహేష్ 27వ చిత్రంగా పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ఇదే క్రమంలో మహేష్ బాబు తన తదుపరి చిత్రాల విషయంలో కొద్దిగా పట్టుదలగా ఉంటున్నాడు అన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే మహేష్ బాబు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికి, ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మొండిచేయి చూపించాడని అంటున్నారు. వారిలో ఒకరు ‘మహర్షి’ తో మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి కాగా మరొకరు ‘స్పైడర్’ తో ఫ్లాప్ అందించిన తమిళ దర్శకుడు మురుగదాస్. ఇక ఇద్దరు డైరెక్టర్లతో మహేష్ కు ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ సిల్వర్ జూబ్లీ చిత్రం ‘మహర్షి’ కి వంశీపైడిపల్లి దర్శకుడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పటికి మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దీంతో తన తరువాత చిత్రం కూడా పైడిపల్లితో మహేష్ కమిట్ అయ్యాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఏడాదికాలంగా కూర్చుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న వంశీ మహేష్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పరశురాం స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సూపర్ స్టార్.
ఇక మహేష్ తర్వాత చిత్రం రాజమౌళి తో ఉండడంతో మహేష్-వంశీ పైడిపల్లి కాంబోలో ఇప్పట్లో సినిమా ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ మధ్య అసలు ఫామ్ లో లేడు. స్పైడర్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఎప్పటికైనా మహేష్ కి మరొక బ్లాక్బస్టర్ ఇస్తానని అప్పత్లో శపథం చేశాడు. అయితే మహేష్ మాత్రం మురుగదాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. మిగతా ఫ్లాపులతో పోలిస్తే స్పైడర్ మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మురుగదాస్ వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా ఏమో భారీ బడ్జెట్. అక్కడ స్క్రీన్ పై చూస్తే మాత్రం అసలు ఖర్చు ఎక్కడ పెట్టారో అర్థం కాలేదు ఎవరికీ. ఇక వంశి ‘మహర్షి’ తో ఫ్యాన్స్ కూడా పూర్తిగా తృప్తి చెందలేదు. మహేష్ ను కరెక్ట్ గా స్క్రీన్ పైన చూపించే దర్శకుడు వచ్చేవరకు అటు మహేష్ ఆకలి తీరదు…. మహేష్ అభిమానుల కొరత తీరదు.