Manchu Lakshmi: టెలివిజన్ రంగంలో అప్పట్లో మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన “మేము సైతం” షో చాలా మంది జీవితాలను నిలబెట్టిన సంగతి తెలిసిందే. సమాజంలో అన్యాయానికి గురైన అనేక కుటుంబాలను అదేవిధంగా పేద కుటుంబాలకు ముఖ్యంగా చదువుకోలేని కుటుంబాలకు… మంచు లక్ష్మి ఈ షో ద్వారా ఆదుకోవడం జరిగింది.
ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలను షోకి తీసుకురావడంతో పాటు… అదే సమయం లో కష్టాలు పడుతున్న కుటుంబాలను తీసుకొచ్చి వారి బాధను వ్యక్తపరుస్తూ… సమాజంలో… ఉండే కష్టాలను కళ్లకు కట్టినట్లు చెబుతూ.. ఒకపక్క సెలబ్రిటీలను కదిలిస్తూ మంచు లక్ష్మి అద్భుతంగా రాణించింది. చాలా మంది పేద పిల్లలకు చదువు కూడా … తమ విద్యా సంస్థల చేత చేప్పించడం జరిగింది. అటువంటి షో కి సంబంధించి వచ్చిన ఒక కుటుంబానికి పోసాని కృష్ణమురళి చేసిన సాయం గురించి తాజాగా మంచు లక్ష్మి స్పందించింది.
మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన “సెట్ అఫ్ ఇండియా” సినిమా వేడుకకు వచ్చిన మంచు లక్ష్మి.. సినిమా గురించి మాట్లాడుతూ చివరిలో… పోసాని కృష్ణ మురళి గురించి మాట్లాడుతూ… చాలామంది వేదికలపైన చెబుతుంటారు. కానీ పోసాని కృష్ణ మురళి మేము సైతం షో లో ఒక కుటుంబాన్ని ఆదుకుని అదే కుటుంబంలో ఒక ఆడపిల్లకు పెళ్ళికి కూడా దగ్గరుండి ఆయన సొంత డబ్బులతో పోసాని కృష్ణమురళి చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను కానీ మీరు బాధ్యత తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు అంటూ పోసాని మంచితనం గురించి మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.