Tollywood: దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో అనేక మందిని ఆదుకోవడం కోసం సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అందరికంటే చాలా ముందు వరుసలో ఉన్నారు సోనూసూద్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో భయంకరంగా మరణ కేకలు పుట్టిస్తూ .. కరోనా బారిన పడిన రోగులు ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని కేసులు పెరుగుతూ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా బారిన పడిన రోగులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న సెలబ్రిటీల లిస్టు ఒకసారి చూద్దాం.
మెడికల్ పరంగా మాత్రమే కాక కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న కుటుంబాలను కూడా ఆదుకున్న వారు ఎవరంటే.. కుర్ర హీరో నిఖిల్ కరోనా పేషెంట్ లకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో కొంతమందికి ఆర్థికంగా ఉపయోగపడటం జరిగింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇచ్చారు రాకేష్ మాస్టర్ కూడా సాయం చేయడం జరిగింది. పెద్ద హీరోల పరంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు, కరోనా పేషంట్లను ఆదుకోవడం జరిగింది. ఇదిలా ఉంటె తన పుట్టిన రోజు నేపథ్యంలో మంచు మనోజ్ కూడా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఉన్న పేదల కుటుంబాలకు నెలకు సరిపడే ముడిసరుకులు అందజేశారు.
రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియాలో.. కరోనా పేషెంట్ లకు .. ట్రీట్ మెంట్ విషయంలో సాయపడుతూ వస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో తాను దత్తత తీసుకున్న రెండు గ్రామాల ప్రజలకు ఫ్రీగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. కొంతమంది హీరోలు నేరుగా సహాయాన్ని పేదలకు అందేలా ముందుకు వస్తూ ఉంటే మరి కొంతమంది హీరోలు ప్రభుత్వాలకు విరాళాల రూపంలో సాయం చేస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కష్టకాలంలో పేదలను, రోగులను ఆదుకోవడం కోసం ముందుకు రావడం విశేషమని జనాలు అంటున్నారు.