Marriage: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా వివాహాది శుభకార్యాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.. కరోనా కారణంగా కొంతమంది ఆన్లైన్ లోనే వివాహ తంతు పూర్తి చేస్తున్నారు.. ఒక్కరితో వివాహం జరగడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో కర్ణాటక కోలార్ కు చెందిన ఉమాపతి మాత్రం.. ఏకంగా ఇద్దరూ అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..
పైన ఫోటోలో ఉన్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అక్క సుప్రియ పుట్టుకతోనే మూగ కాగా, చెల్లెలు లలిత కి చెడు.. దీంతో వీరికి పెళ్లి చేయడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది అయితే.. ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకరిని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఉమాపతి వారి నిర్ణయాన్ని అంగీకరించాడు.. మే 7న ముళబగలు లోని వారి సొంత గ్రామం వేగమడుగులో పెద్దల సమక్షంలో అక్కాచెల్లెళ్లను ఉమాపతి వివాహం చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో ఒకే మండపంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.