Mask : కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది.. వైరస్ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం పరిపాటిగా మారింది.. దీంతో వాడి పడేసిన మాస్క్ లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి..100 మందిలో కనీసం ముగ్గురూ ప్రతిరోజు ఒక్క మాస్క్ ను వాడి పడేసే ఆ వ్యర్థాలతో రోజుకు ఒక పది ఫుట్బాల్ గ్రౌండ్ లను నింపవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.. ఈ వ్యర్ధాలతో మళ్లీ సరికొత్త సమస్య తలెత్తుతుందని ఎప్పటి నుంచో పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.. దీంతో ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు.. ఆ వ్యర్థాలకు సరికొత్త అర్థం కల్పించాలని ఉద్దేశంతో ప్రయత్నం చేసి విజయం సాధించారు.. పూర్తి వివరాలు ఇలా..
కరోనా వైరస్ నివారణకు మాస్కులు ధరించడం, హ్యాండ్స్ శానిటైజర్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిన్న విషయం అందరికీ తెలిసిందే.. ఒక్క రోజులో వాడి పడేస్తున్న మాస్క్ లను ముక్కలుగా చేసి భవనాల వ్యర్థాలకు కలిపి ఒక కాంక్రీట్ ను తయారు చేశారు. ఆ సరికొత్త కాంక్రీట్ ను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించడానికి పనికి వస్తుందని గుర్తించారు. 100% మిశ్రమంలో 99 వంతు వరకు రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్ (RCA) భవన వ్యర్థానికి ఒక వంతు మాస్క్ ముక్కలను కలిపి వీరు కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మించిన రోడ్లు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ కాంక్రీట్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరీక్షలు నిర్వహించారు. రహదారి నిర్మాణం లోని మొదటి మూడు పొరలకు ఈ మిశ్రమాన్ని వాడవచ్చునని తమ పరీక్షలో స్పష్టమైందని తెలిపారు. ఒక కిలో మీటరు రహదారి నిర్మాణం లో సుమారు 30 లక్షల వ్యర్థాలను వినియోగించవచ్చు.. దీనిద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పలో కి చేరకుండా నివారించవచ్చునని మహమ్మద్ సాబేరియన్ తెలిపారు. ప్రపంచ పర్యావరణానికి తీసుకువచ్చిన కొత్త సమస్యకు ఇది సరికొత్త పరిష్కారమని చెప్పారు. అంతేకాకుండా మహమ్మద్ సాబేరియన్ తరువాత పరిశోధన ను పిపి కిట్స్ ను రీసైకిల్ చేయడం అని వివరించారు.