Memory: ఇప్పుడు పిల్లలను పెద్ద వారిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య మతిమరుపు.. జ్ఞాపక శక్తి లేకపోవడం.. జ్ఞాపకశక్తి అనేది మన నిత్యజీవితంలో ప్రతి పనికి ముఖ్యం.. లోపిస్తే ప్రతి పనికి ఆటంకం ఏర్పడుతుంది.. ఏదైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా పరిగణించవచ్చు.. మనం జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లు లో నిక్షిప్తమై ఉంటాయి.. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి..!! నేటి మన ఆధునిక జీవన విధానం వలన జ్ఞాపక శక్తి త్వరగా లోపిస్తుంది.. మతిమరుపు పోయి జ్ఞాపకశక్తి పెరగడానికి ఆయుర్వేద వైద్యంలో చక్కటి చిట్కా ఉంది..!! ఈ లేహ్యాన్ని తయారుచేసుకొని తాగితే జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది..!! అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Memory: మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరగడానికి చక్కటి ఆయుర్వేద చిట్కా తయారు చేసుకునే విధానం..!!
కావలసిన పదార్థాలు:
సరస్వతి పచ్చి ఆకు – 3 కేజీలు, అక్కల కర్ర – 300 గ్రాములు, బాదం పప్పు – 200 గ్రాములు, ఆక్రోట్ పప్పు శంఖ పుస్పి – 25 గ్రాములు, వస – 25 గ్రాములు, జాజికాయ – 25 గ్రాములు, గసగసాలు – 25 గ్రాములు, సొంటి – 25 గ్రాములు, మిరియాలు – 25 గ్రాములు, పిప్పళ్ళు – 25 గ్రాములు, ఉసిరికాయలు – 25 గ్రాములు, ఆకుపత్రి – 25 గ్రాములు, జాపత్రి – 25 గ్రాములు, లవంగాలు – 10 గ్రాములు, యాలకులు – 10 గ్రాములు, దాల్చిన చెక్క – 10 గ్రాములు, జీలకర్ర – 10 గ్రాములు, కుంకుమపువ్వు- 1 గ్రాము, గోరోజనం- 1 గ్రాము.
ముందుగా సరస్వతి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్టులా నూరుకోవాలి. పైన చెప్పుకున్న మోతాదు లో మిగిలిన అన్ని పదార్థాలను ఒక కలిపి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొడిలో సరస్వతి ఆకుల మిశ్రమాన్ని వేసి నీడలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన సరస్వతి ఆకు ల లోని శక్తి అన్ని మూలికల లోకి ఇంకుతుంది. బాగా ఆరిన తర్వాత ఈ చూర్ణానికి మొత్తం బరువుకి పటిక బెల్లం లేదా పాత బెల్లం లేదా తాటి బెల్లం వేసుకొని తగినంత తేనె, తగినంత నెయ్యి కలిపి లేహ్యం ఎలా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న లేహ్యాన్ని పిల్లలు పావుచెంచా పెద్దలు ఒక చెంచా పాలతో లేదా నీటితో కలిపి తీసుకోవాలి. ఇది చిన్న పిల్లలకు పెద్దవారికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ప్రతిరోజూ సేవించడం వలన మేధా శక్తి పెరుగుతుంది. తెలివితేటలు, జ్ఞాపకశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లలు దీనిని తీసుకోవటం వలన ఏకసంతాగ్రహి అవుతారు. మతిమరుపు రానివ్వదు. పిల్లలకి, పెద్దలకు తక్షణ శక్తిని అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నత్తి ఉన్న వారికి నత్తి పోయి చక్కటి వాక్చాతుర్యం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. మెదడులోని నరాలు ఉత్తేజితమై యాక్టివ్ గా ఉంటారు పిల్లలు లేదా పెద్దలలో కలిగే ఈ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీన్ని చక్కగా తయారు చేసుకొని ఉపయోగించండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి.