Miss Universe 2020: 69వ మిస్ యూనివర్స్ పోటీలు ఫ్లోరిడా లో ఘనంగా ముగిసాయి.. ఈ పోటీలు గత సంవత్సరం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.. 2020కి గాను మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికో ఆండ్రియా మెజా ను వరించింది..!! ఈ అందాల పోటీల్లో జూలియా గామా బ్రెజిల్ మొదటి రన్నర్-అప్ గా నిలవగా జానిక్ మెకతి పెరు రెండో రన్నరప్ గా.. భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అడ్లైన్ క్యాస్టిలినొ మూడో రన్నరప్ గా నిలిచింది..!! ఈ పోటీల్లో గెలవాలంటే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.. ఇందులో భాగంగా మిస్ ఇండియాను అడిగిన చివరి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తోంది..!! ఆమెపై కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!
ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. కరోనా వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ దేశాలు లాక్ డౌన్ విధించాలా.? లేదా ఆ అంశాలను తొలగించి యధావిధిగా కార్యకలాపాలను కొనసాగించాలా.? ఒకవేళ కొనసాగిస్తే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందా.? అని ప్రశ్న అడిగారు..
” ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాను. మనం ప్రేమించే వారి ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు.. ఆర్థిక రంగం, ఆరోగ్యం మధ్య సమతుల్యత ఉండాలి. ప్రభుత్వం ప్రజలతో కలిసి పని చేసినప్పుడే అది సాధ్యం అవుతుంది.. అది దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి తోడ్పడుతుందని” సమాధానమిచ్చింది అడ్లైన్ క్యాస్టిలినొ.. దీనికి సంబంధించిన వీడియో కొద్ది గంటల్లోనే పదివేలకు పైగా లైక్స్ వచ్చాయి. మిస్ ఇండియా గట్టి సమాధానం చెప్పింది, ఆమె సమాధానం అద్భుతం.. అంటూ కామెంట్లతో ఆమెపై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు..
What a powerful final answer from India. #MISSUNIVERSE
LIVE on @FYI from @hardrockholly in #HollywoodFL pic.twitter.com/gmAjzt6n3T
— Miss Universe (@MissUniverse) May 17, 2021