ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వానికి వరుసగా నాలుగవ షాకు అనే చెప్పాలి. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరలా తన పదవిని చేపడతారు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అసలు నిమ్మగడ్డ నియామకమే చెల్లదని వాదిస్తూ హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకపోవడం గమనార్హం.
ఈ లోపల నిమ్మగడ్డ మాత్రం తను మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా చార్జి తీసుకుంటున్నట్లు ప్రకటించేశాడు. ఇక జగన్ సర్కారు ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంతలోనే కొన్ని అత్యుత్సాహం మీడియా సంస్థలు జగన్ కోర్టు తీర్పులు అమలు చేయకపోతే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో కొన్ని కథనాలు రాయడం మొదలు పెట్టాయి. ఇప్పటికే జగన్ సర్కార్ హైకోర్టు తీర్పులను గౌరవించడం లేదని ని టిడిపి నాయకులు విపరీతంగా ప్త్రచారం చేస్తున్నారు.
నిజంగానే ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తున్నా జగన్ కోర్టు తీర్పులను అమలు చేయకపోతే ఏమవుతుంది అన్న అంశం పై రాజకీయ నిపుణులు ఖచ్చితమైన సమాధానం తో స్పందించారు. అయినా జగన్ ప్రభ్త్వం అంతటి ధైర్యం చేస్తుందని తాము భావించడం లేదని చెప్పిన వారు హైకోర్టు మరియు సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపుతారని దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తరఫ్ చేసే వెసులుబాటు కూడా రాజ్యాంగంలో కల్పించాలని వివరించారు.
అయితే ఈ ప్రక్రియ అనేది అది అడ్డగోలుగా చేయకూడదని…. ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు వివరించిందని వారు గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ ప్రతిష్టంభనకు కారణమైనట్టు రుజువులు ఉండాలని సూచించారు. ఇక జగన్ పంతం మరియు పత్టింపులకు వెళ్ళే మనిషి కాబట్టి రానున్న రోజుల్లో కేంద్రం ఇలాంటి కీలక అడుగులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే చెప్పాలి.