బిగ్ బాస్ లో సెలబ్రిటీ అడుగుపెట్టిన గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ బాగానే గుర్తింపు దక్కించుకుంది. కొద్ది నెలల్లోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని ఆఫర్లు వచ్చాయి అని వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె బిగ్ బాస్ లోని కొందరు కంటెస్టెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఏ అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన మోనాల్ అందరితో మంచిగా ఉంటూ ఉండేది. అయితే అఖిల్ అభిజిత్ తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా మారింది. మొదటి వారంలో హైలెట్ అయిపోయింది. ముఖ్యంగా అఖిల్తో రొమాన్స్ పీక్స్ లో చేసింది. ఆ సమయంలోనే ముద్దులు కౌగిలింతలతో రెచ్చిపోయి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఇక మొత్తానికి ఆమె ఫైనల్స్ కి ఒక మెట్టు కి ఆగిపోయింది.
అయితే మోనాల్ ను ఇన్ని రోజులు ఇంట్లో కావాలని గ్లామర్ షో కోసం ఉంచారని ఎన్నో విమర్శలు వచ్చాయి. మొత్తానికి ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో “డాన్స్ +” షో కి జడ్జి గా ఎంపిక అయ్యింది. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తోంది.
ఈ సమయంలో ఇంటి లోని కొంతమంది కంటెస్టెంట్స్ ను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది మోనాల్. హౌస్ లో చాలామంది కంటెస్టెంట్ లు జంటగా గ్రూపులుగా ఆడారు వాళ్లంతా చివరివరకు ఉన్నాము మేము మాత్రం గేమ్ ను గేమ్ లాగే ఆడి అదే సమయంలో రిలేషన్ కొనసాగించమని చెప్పింది. ఈ నేపథ్యంలో మోనాల్ చేసిన కామెంట్లు అభిజిత్ ను ఉద్దేశించి చేసినవే అని బయట టాక్ గట్టిగా వినిపిస్తోంది.