కరోనా వైరస్ 2019 డిసెంబర్ నెలలో చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి , ప్రపంచ దేశాలన్నింటిలో విలయతాండవం చేస్తూ కొన్ని లక్షల మంది మరణాలకి కారణమైంది. ఇంకా కొన్ని కోట్ల మంది దీని బారిన పడి అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూ రూపాంతరం చెంది, ఇంకా ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కరోనా వైరస్ ప్రధమంగా మన శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. దీని లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా జలుబు మాదిరిగానే ఉంటాయి తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత దీని లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. జలుబు, జ్వరం ,దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి , రుచిని కోల్పోవడం, వాసన చూడలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు వైరస్ బారిన పడిన పద్నాలుగు రోజుల్లోపు కనిపిస్తాయి. కరోనా వస్తే జ్వరం వస్తుందనే సంగతి అందరికి తెలుసు.అయితే కరోనా వల్ల వచ్చే జ్వరాన్ని తక్కువగా భావించవద్దని, అది చాలా ప్రమాదకరమైనదని తాజా అధ్యయనం ఒక్కటి వెల్లడించారుది “లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్”లో పేర్కొన్న వివరాల ప్రకారం. 2020 మార్చి, ఏప్రిల్ మధ్య కరోనాకు గురైన 89,530 మంది బాధితుల వివరాలు తీసుకొని, 2018 నుంచి 2019 వరకు సీజనల్ వ్యాధులతో బాధపడిన రోగులతో సరి చూడగా, కరోనా వల్ల వచ్చే జ్వరం తీవ్రతను తెలుసుకున్నారు.వీరిలో 16.9 శాతం మంది బాధితులు కరోనా వల్ల కలిగిన తీవ్రమైన జ్వరం వల్లే చనిపోయినట్లు గుర్తించారు. సాధారణ జ్వరంతో 5.8 శాతం మంది మాత్రమే చనిపోయారు.సాధారణ జ్వరంతో పోల్చితే కరోనా వల్ల కలిగే జ్వరం మూడు రెట్లు ప్రమాదకారి అని, తీవ్రమైన సాధారణ జ్వరంతో బాధపడేవారిలో 10.8 శాతం మందికి ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందితే, కరోనా బాధితుల్లో 16.3 శాతం మందిని ఇంటెన్సివ్ కేర్లో చికిత్స తీసుకున్నారు.ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన డిజాన్ యూనివర్శిటీ హాస్పిటల్, ఫ్రెంచ్ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ‘INSERM’ ప్రొఫెసర్ కేథరిన్ క్యాంటిన్ తన పరిశోధనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో ఉందని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి కరోనా గురించి పూర్తి అవగాహన లేదు వైద్యులు సూచించిన సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం ,శానిటైజర్ లు వాడడం వంటివి పూర్తిగా పక్కన పడేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు . కరోనా వైరస్ పూర్తిగా ప్రపంచాన్ని వదిలి పోలేదు. కరోనా వైరస్ నుంచి మనల్ని రక్షించడానికి సరైన వ్యాక్సిన్లు అందుబాటులో లేదు. ఇంకా వ్యాక్సిన్లు ప్రయోగ దశలోనే ఉన్నాయి. కనుక కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనము కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .