Motera Stadium : ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ..! ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం లో భారత్–ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్ట్ జరుగుతుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ తోనే ఈ స్టేడియం ను ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకలో పాల్గొన్నారు.
అయితే ఈ స్టేడియం కి ముందు ‘సర్దార్ వల్లభబాయ్ పటేల్‘ స్టేడియం అని పేరు పెట్టారు. అయితే తాజాగా రాష్ట్రపతి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కి ‘నరేంద్రమోది స్టేడియం‘ అని పేరు మార్చడంతో అది కాస్త సంచలనం అయింది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం కి ముందు ‘వల్లభభాయ్ పటేల్‘ పేరును పెట్టి తర్వాత మోడీ పేరుని మార్చడం పై అనేకమంది ఎన్నో విమర్శలు చేశారు.
ఐక్యత కోసం అంటూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరుని ఇన్ని రోజులు వాడుకున్న నరేంద్ర మోడీ ఏకంగా అతని పేరునే తొలగించడం సంచలనమైంది. సహజంగా నేతలు రిటైరయ్యాక లేదా చనిపోతేనో వారికి గుర్తుగా ఇటువంటి స్టేడియం లకు, విమానాశ్రయాలకు ఆ పేర్లు పెడతారు. అయితే బ్రతికి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టడం అనేది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే…. స్టేడియంలో బౌలర్లు పరిగెత్తుకుంటూ వచ్చే భాగాన్ని ‘ఎండ్‘ అని పిలుస్తారు. వాతికి సాధారణంగా మాజీ క్రికెటర్ ల పేర్లు, లేదా స్వాతంత్ర సమరయోధులు పేర్లు లేదా క్రికెట్ కు సంబంధించిన వాటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ఈ స్టేడియంలో మాత్రం ఒకవైపుకి ‘రిలయన్స్ ఎండ్‘ అని పేరు పెడితే… మరొకవైపుకి ‘అదానీ ఎండ్’ అని పేరు పెట్టారు. అసలు క్రికెట్ స్టేడియంలోని భాగాలకు పారిశ్రామిక వేత్తల పేర్లు పెట్టడం కూడా దుమారం రేపింది. ఇక ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమంలో ప్రధాన విలన్లు కూడా వీరిద్దరే కావడం గమనార్హం.
గతంలో కాంగ్రెస్ లో దివంగతులైన ఇందిరా గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ పేర్లు పెడితే బీజేపీ. నరేంద్ర మోడీ విమర్శించారు. అయితే ఇప్పుడు ఏకంగా బ్రతికున్న మోడీ పేరు స్టేడియం కి పెట్టడం చర్చనీయాంశమైంది. అతనితో పాటు అతనికి ఎంతో సన్నిహితులు అని భావించబడే పారిశ్రామికవేత్తలు పేర్లు పెట్టడం కూడా నెటిజనులకు ఆగ్రహం తెప్పించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?