Mugguru Monagallu Trailer: శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ముగ్గురు మొనగాళ్లు.. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులలో ఒకరికి వినిపించదు.. ఒకరికి కనిపించదు.. మరొకరు మాట్లాడలేరు.. అంటూ ఇటీవల ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

నగరంలో జరుగుతున్న వరుస హత్యలు ఈ ముగ్గురు జీవితాలను ఎలా ప్రభావితం చేశారని ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు లను కవర్ చేస్తూ చేసిన సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టి ఎన్ ఆర్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది..