Mulla Gorinta: మనం నిత్యం అనేక రకాల పూల మొక్కలను చూస్తుంటాం.. పూల మొక్కల లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి.. అటువంటి వాటిలో ముళ్ళ గోరింట కూడా ఒకటి.. దీనిని ముళ్ళ గోరింట లేదా తేనె పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారు.. ఇది ఎక్కువగా చలికాలం లో వస్తాయి.. అందుకే దీనిని చాలామంది డిసెంబర్లా చెట్టు అని కూడా పిలుస్తారు..!! ఈ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.. ముళ్ళ గోరింట మన ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Mulla Gorinta: ముళ్ళ గోరింట ను ఇందుకే వజ్రదంతి అని పిలుస్తారు..!!
ముళ్ళ గోరింట వేర్లతో పళ్లు తోమడం వలన పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి.. దీనిని సంస్కృతంలో వజ్రదంతి అంటారు.. పళ్ళు ను వజ్రాల మెరిసిపోయేలా చేస్తుంది కాబట్టి దీనికి వజ్రదంతి అని పేరు వచ్చింది.. అంతేకాకుండా ఇది దంత సమస్యలను తొలగిస్తుంది. ఈ చెట్టు ఆకులకు ఉప్పు కలిపి మెత్తగా నూరు కోవాలి. ఈ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే దంతాలపై ఉన్న గారా, పసుపు, పాచ్చి పోతాయి. దంతాలు తెల్లగా మెరుస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల పంటి సమస్యలను నివారిస్తుంది.
ఈ ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేచి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడగట్టుకుని నీటితో నోరు పుక్కిలించి న్నట్లయితే నోటి దుర్వాసన పోతుంది మౌత్ అల్సర్ తగ్గిస్తుంది. ఇది చక్కటి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడు ను సేకరించి దంచి పొడి చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక చెంచా పొడిని తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఈ పొడిని ప్రతి రోజు తీసుకోవడం వలన శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ చెట్టు బెరడు అద్భుతంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.
ఈ బేరడు పొడితో పళ్ళు తోముకుంటే పంటి మీద పసుపు పచ్చదనం పోయి మిల మిల మెరిసి పోతాయి. ఈ చెట్టు ఆకులను సేకరించి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలో నొప్పులు ఉన్నచోట మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట కట్టుగా కట్టి ఉదయం ఆ కట్టు తీసి వేస్తే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి. అలాగే శరీరంపై ఉన్న వాపులను కూడా తగ్గిస్తుంది. ఆకుల రసం తేనే కలిపి తీసుకోవడం వలన నోటి పూత, నోటి దుర్వాసన ను తగ్గిస్తుంది. మొక్కలు చాలా ఆయుర్వేద ఔషధగుణాలు ఉన్నప్పటికీ ఈ ఆకుల రసాన్ని 50 – 100 ML మించి తీసుకోకూడదు. వజ్రదంతి పేరులో ఉన్నట్టే ఇది దంత సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.