నువ్వు ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే నేను సోకుతా అంటున్న కరోనా వైరస్ నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సోకింది. ప్రస్తుతం అమెరికాలో త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగబోతుండడంతో డోనాల్డ్ ట్రాంప్ అందులో పాల్గొని ప్రచారం చేశారు. ఇక ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకింది. ఇక డోనాల్డ్ ట్రాంప్ కు కరోనా రావడంతో అక్కడ ఒక్కో మీడియా ఒక్కో రేంజ్ లో ప్రచారం చేస్తుంది.
కొన్ని మీడియాలు ట్రాంప్ ఆరోగ్యం దారుణంగా ఉందని చెప్తే.. మరి కొన్ని మీడియాలు ట్రాంప్ పూర్తిగా కోలుకున్నాడని ఈరోజు డిశ్చార్జ్ అవుతాడని ప్రచారం చేస్తున్నారు. ఇది అంత ఇలా ఉండగా ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం గురించి తెలిస్తే ఎవరైనా సరే వామ్మో అని అనాల్సిందే.
మూడేళ్ల క్రితం అమెరికాలో జాత్యాహంకార దాడుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ అనే సాఫ్ట్ వెర్ మృతిచెందాడు. కేవలం అతడు ఒకడే కాదు మరికొందరు కూడా ఈ దాడుల్లో మృతి చెందారు. అయితే ఆ సమయంలో ఓ సిద్ధాంతి డోనాల్డ్ ట్రాంప్ కి శాపం పెట్టాడట. ఆ శాపం వల్లే ఇప్పుడు ట్రాంప్ ఆరోగ్యం క్షిణించిందని ప్రచారం జరుగుతుంది.
జాత్యాహంకారీ డొనాల్డ్ ట్రంప్ వల్లే భారతీయులు దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని.. ఈ పాపానికి నీ చావు దారుణంగా ఉంటుందని.. నీ మరణ విషయంలో ఎవరు లేకుండా కుక్క చావు చస్తావ్ అని అతడు శాపం పెట్టాడు. ఇప్పుడు అలానే కరోనా సోకి ఆస్పత్రిపాలయ్యాడు డోనాల్డ్ ట్రాంప్. మరి సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శాపం ఎంత నిజం అవుతుంది అనేది చూడాలి.