మీటూ ఉద్యమంతో దేశంలో ఒక కొత్త యుగానికి నాంధి పడిందని చెప్పొచ్చు. అప్పటివరకు ఎన్ని లైంగిక దాడులు అమ్మాయి మీద జరిగినా.. భయట పెట్టేందుకు చాలా మంది ముందుకు రాకపోయేది. వచ్చిన కొందరు కూడా ఎంతో భయంతో ఏం చెప్పాలో తెలియక ఆలోచించేవారు. కానీ ఎప్పుడైతే మీటూ ఉద్యమం వచ్చిందో.. అప్పటి నుంచి సినీ యాక్టర్ల నుంచి మాములు జనం వరకు తమకు జరిగిన బాధను చెప్పుకోవడం మొదలైంది.
దాంతో పోలీసులు ఈ కేసుల మీద మరింత దృష్టి సారించారు. తప్పు చేసిన పలువురికి శిక్ష పడేలా చేశారు. మీటూలో ఇప్పటికే చాలా మంది మహిళలు పలు రంగాల్లో వారికి జరిగిన లైంగిక వేధింపులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మీటూ ఉద్యమం వల్ల ముఖ్యంగా సినీ పరిశ్రమలో జరిగిన లైగింగ వేధింపులు ఎక్కువుగా వెలుగులోకి వచ్చాయి.
హీరోయిన్ తనుశ్రీ దత్త ఈ మధ్య తను మరో యాక్టర్ నానా పటేకర్ తో ఒక సినిమా షూటింగ్ పాల్గొన్నారు. ఈ సమయంలో అతను లైగింకంగా వేధించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చాలా మంది హీరోయిన్లు వారికి జరిగిన వేధింపులను సోషల్ మీడియా వేధికగా పంచుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ కేసులను నమొదు చేశారు. అలాగే మరో నటి పాయల్ ఘోష్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది. తను హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై పలు ఆరోపణలు చేశారు.
ఇప్పుడు టెలివిజన్ నటి ఒక క్యాస్టింగ్ డైరెక్టర్పై లైగింక ఆరోపణలు చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. హిందీ టీవీ కాస్టింగ్ డైరెక్టర్ ఆయుష్ తివారీపై ఈ నటి అరోపించింది. ఆయు తివారీ తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. అలాగే అతనిపై పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేసింది. దాంతో అతనిపై పోలీసులపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. క్యాస్టింగ్ డైరెక్టర్ అయిన ఆయుష్ తివారి సదరు ఆ నటిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ పెళ్లి సాకుతో ఆ నటిపై రెండేళ్లలుగా అత్యాచారం చేశాడు. ఇలా పలు విషయాలను పోలీసులకు ఆ నటి తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. దాంతో నవంబర్ 26 న ఈ కేసును నమొదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.