మన భారత జాతి పరంపరగా అనేక విలువైన ఆస్తులను కలిగి వుంది. అయితే బ్రిటిష్ వారి పరిపాలనలో భాగంగా కోట్ల విలువైన సంపద విదేశాలకు తరలి వెళ్లిందనే విషయం అందరికీ తెలిసినదే. అందులో విలువైన కోహినూరు డైమండ్, మరకత మణులు, కోట్ల విలువచేసే వివిధ రాళ్లు కొట్టుకొని పోయారు.
తంజావూరులోని బ్యాంకు లాకర్ లో ఓ పురాతన శివలింగాన్ని దాచిపెట్టినట్టు NS అరుణ్ తెలిపాడు.
అయితే ఇప్పటికీ మన హిందూ దేవాలయాలలో వున్న విగ్రహాలమీద విదేశీయుల కన్ను వుంది అంటే నమ్మశక్యం కాదు. తాజాగా ఈ విషయాన్ని నిజం చేస్తూ తమిళనాడులోని కుంభకోణం తాలూకా తందన్కొట్టంలోని ఓ ఆలయంలో దాదాపు 50 ఏండ్ల క్రితం దొంగతనానికి గురైన పార్వతీ దేవి విగ్రహం తాజాగా అమెరికాలో బయటపడింది.
దొంగతనానికి గురైన పార్వతీ దేవి విగ్రహం
న్యూయార్క్ లోని బోన్హామ్స్ వేలంలో ఈ విగ్రహం ఉన్నట్టు గుర్తించామని తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ తాజాగా వెల్లడించింది. ఇలాంటి ఘటనలు మొదటసారి మాత్రం కాదు. అనేకమార్లు ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూ వున్నాయి.
ఇటీవలె అత్యంత విలువైన, అరుదైన మరకత శివలింగం ఒకటి తమిళనాడులోని తంజావూరులో వెలుగు చూసిన విషయం తెలిసినదే. ఈ శివలింగం విలువ అక్షరాలా రూ. 500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏడీజీపీ కె.జయంత్ మురళి చెన్నైలో వెల్లడించారు.
సామియపన్ అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో విలువైన శివలింగాలు
ఇకపోతే తంజావూరు, అరుళనంద నగర్ లో సామియపన్ అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అండగా ఈ విషయం కాస్త బయల్పడింది.
CID పోలీసు అధికారులు డిసెంబర్ 30న సామియపన్ ఇంట్లో సోదాలు నిర్వహించి సామియపన్ కుమారుడు NS అరుణ్ను ప్రశ్నించగా తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ తంజావూరులోని బ్యాంకు లాకర్ లో ఓ పురాతన శివలింగాన్ని దాచిపెట్టినట్టు NS అరుణ్ తెలిపాడు.
బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయన ఇచ్చిన సమాచారం మేరకు బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగానికి సంబంధించిన ధ్రువపత్రాలేవి నిందితుల వద్ద లేకపోవడంతో ఆ విగ్రహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.