Naga Chaithanya: అక్కినేని కుటుంబం నుండి హీరోగా నాగార్జున వారసుడిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాప్ హీరోయిన్ సమంత ని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య… గత ఏడాది విడాకులు ఇవ్వడం తెలిసిందే. అయితే విడాకులు తీసుకుని.. నాలుగు నెలలు కావస్తున్నా గానీ కారణం ఏంటో ఇంతవరకు ఎవరికి తెలియదు. మరోపక్క నాగచైతన్య కెరీర్ పరంగా సినిమాల విషయంలో దూసుకుపోతున్నాడు.
పరిస్థితి ఇలా ఉంటే నాగచైతన్య ఇప్పుడు తండ్రి నాగార్జున బాటలోనే ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే నాగార్జున ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణించడం జరిగింది. ఇప్పుడు నాగచైతన్య కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. విషయంలోకి వెళితే హైదరాబాద్ లో “షోయూ” అనే పెద్ద రెస్టారెంట్ నీ నాగచైతన్య అందుబాటులోకి తెచ్చారు.
ఆసియా ఖండంలో దొరికే హైలెట్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఈ రెస్టారెంట్ ద్వారా భోజనప్రియులకి అందించనున్నారు. తాజాగా తన రెస్టారెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించడం జరిగింది. షోయు ద్వారా బెస్ట్ ఏషియన్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇస్తే వాటిని డెలివరీ చేసే రీతిలో… నాగచైతన్య బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. తాజా వీడియో చూసి అక్కినేని అభిమానులు చైతూకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, బన్నీ ఇప్పటికే ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నాగచైతన్య అడుగుపెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.