Garikapati Nagababu: ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” తో అట్టర్ ఫ్లాప్ అందుకున్న చిరంజీవి దసరా పండుగ నాడు “గాడ్ ఫాదర్” తో బ్లాక్ బస్టర్ అందుకోవటం తెలిసిందే. “గాడ్ ఫాదర్” విజయం సాధించటంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా పవర్ ఫుల్ రోల్ లో చిరంజీవిని అద్భుతంగా డైరెక్టర్ మోహన్ రాజా చూపించారని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా సూపర్ హిట్ కావడంతో చిరంజీవి కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రతి ఏడాది బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె విజయలక్ష్మి “అలయ్ బలయ్” కార్యక్రమం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చిరంజీవి ఇంటికి వెళ్లి మరి దత్తాత్రేయ ఆయన కుమార్తె ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు “అలయ్ బలయ్” కార్యక్రమానికి హాజరైన చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. “అలయ్ బలయ్” కార్యక్రమానికి చిరంజీవి కంటే ముందుగానే గరికపాటి హాజరయ్యారు. ఈ క్రమంలో గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవ రావటం జరిగింది. దీంతో గరికపాటి ప్రసంగాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోకుండా చిరంజీవితో సెల్ఫీలకు దిగటానికి వేదికపై ఉన్న జనాలు ఎగబడ్డారు. ఈ సన్నివేశాన్ని చూస్తున్న గరికపాటి… చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెంటనే వెళ్ళిపోతాను అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
దీంతో వెంటనే చిరంజీవి అక్కడి నుంచి వచ్చి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చాలామంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఉన్న సభలో చిరంజీవి పై గరికపాటి ఒక్కసారిగా సీరియస్ కావటం సంచలనంగా మారింది. దీంతో గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైర్లు వేశారు.” ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే…” అంటూ నాగబాబు తన పోస్ట్లో పేర్కొన్నారు. చిరంజీవి ఇమేజ్ పట్ల గరికపాటికి అసూయ కలిగిందని … అన్నట్టు నాగబాబు గరికపాటి పేరు ప్రస్తావించకుండా సెటైర్ వెయ్యడం జరిగింది. దీంతో నాగబాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.