బుల్లితెర రాములమ్మ శ్రీముఖి తెలుగు ఎంటర్టైన్మెంట్ షో లోకి దూసుకొచ్చిన యువ కెరటం. ఈమె గొంతు ఏ రేంజ్ లో మోగుతుందో అందరికీ తెలిసిందే. వాయిస్ బాక్స్ గా పేరొందిన శ్రీముఖి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపకు సుపరిచితమే. ‘పటాస్’ షో తో ఎనలేని క్రేజ్ సంపాదించిన శ్రీముఖి బిగ్ బాస్ షో తో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే అదే ఈ క్రమంలో కాస్త నెగిటివిటీ ను కూడా సంపాదించుకుంది. అయితే ఏమీ… బ్గ్ బాస్ మూడవ సీజన్ లో చివరికి రన్నరప్ గా నిలిచింది. చాలామంది అయితే శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాల్సిందని ఆశించారు.
ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పటివరకూ ఆమె లైఫ్ లో పెద్దగా కాంట్రవర్సీలు లేవనే చెప్పాలి. కేవలం అల్లరి చేస్తూనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బిగ్ బాస్ షోలో లౌడ్ స్పీకర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. శ్రీ ముఖి అలా టీవీలో కనిపిస్తే మ్యూట్లో పెట్టాల్సి వస్తుందని చిన్నపాటి సెటైర్లు వేసే వారు. నాగార్జున సైతం ఆమె అరుపులు కంట్రోల్ చేసుకోమని తన ఇంటి వరకు ఆమె అరుపులు వినిపిస్తున్నాయి అని గతంలో కౌంటర్లు వేశాడు. శ్రీముఖిని అలా అందరూ లౌడ్ స్పీకర్ అంటూ ఫన్నీ కామెంట్లు చేసేవారు.
తాజాగా ‘అదిరింది’ షో కి యాంకర్ గా శ్రీముఖి వచ్చింది. అదిరింది షో 25 ఎపిసోడ్ లో దాని పేరు ని ‘బొమ్మ అదిరింది’ గా మార్చారు. అందులో భాగంగా యాంకర్ రవి, భాను శ్రీ స్థానంలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. జడ్జి అయిన నాగబాబును చూసి శ్రీముఖి.. ఇక మీరు ప్రశాంతంగా వెళ్లి కూర్చోండి అని చెప్పింది.
“నువ్వు ఉండగా ఇంక నాకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది….?” శ్రీముఖి ఉంటే అసలు ప్రశాంతత ఉండదు” అన్నట్లు నాగబాబు నుండి కౌంటర్ రావడంతో ఆమె మొహం మాడిపోయింది. “సార్ మీరు కూడా ఇలాగే అంటారా…” అని కొద్దిగా ఫీల్ అయింది.. దీంతో అందరూ నాగబాబు పుసుక్కున నోరుజారాడని అనుకున్నారు కానీ శ్రీ ముఖి తర్వాత వెంటనే నవ్వేసింది.
https://www.instagram.com/p/CF3zb2XJO0N/?utm_source=ig_web_copy_link