Chiranjeevi: కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీలో మెగా కుటుంబం అనేక సహాయ కార్యక్రమాలు ముందు నుండి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ ఇండియాలో రాకముందు.. ఇండస్ట్రీలో అన్నీ షూటింగ్ లో జరుగుతున్న గాని.. ఆచార్య సినిమా షూటింగ్ ఆపేయటం జరిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోక ముందే చిరంజీవి చాలా బాధ్యతగా ఇతరులతో ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. ఆచార్య సినిమా షూటింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి సారిగా ఆపేశారు.
అదేసమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు లోకి తీసుకు రావడంతో ఒక్కసారిగా.. పరిస్థితులు మారిపోయాయి. థియేటర్లో క్లోజ్ అవడం సినిమా షూటింగ్ లేకపోవడంతో ఇండస్ట్రీ ని నమ్ముకున్న సినీ కార్మికులకు పని లేకుండా ఉండటంతో.. అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వెంటనే చిరంజీవి బాధ్యత తీసుకుని కరోన క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి .. ఇండస్ట్రీలో ఉన్న హీరోల దగ్గర విరాళాలు సేకరించి సినీ కార్మికులకు నిత్యవసర వస్తువులు అదేరీతిలో ఇటీవల ఫ్రీగా వ్యాక్సిన్ వేయించటం జరిగింది.
Read More: Chiranjeevi: మరో అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న చిరంజీవి..చరణ్..??
ఇదే తరుణంలో టీవీ నటీనటులకు కూడా ఫ్రీగా చిరంజీవి వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించడంతో చాలామంది టెలివిజన్ రంగానికి చెందిన వాళ్లు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ రంగంలో రాణిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు.. చిరంజీవి రీతిగా సర్వ తీసుకొని.. ఇండస్ట్రీ ని నమ్ముకున్న నటీనటులకు అండగా నిలబడ్డారు అని అభినందిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు టీవీ నటీనటులతో వ్యాక్సిన్ వేయించుకున్న వారితో కలిపి చెప్పారు.