బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎపిసోడ్ లో సభ్యులపై కొద్దిగా సీరియస్ అయిన నాగార్జున ఎప్పటిలాగే ఫన్ గేమ్స్, టాస్క్స్ ఆడించారు. 27 వ రోజున సభ్యులందరితో నాగార్జున సరదాగా ఉంటూ ముక్కు అవినాష్, అరియానా గ్లోరో లను ఆట పట్టించాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులకు ఈట్ అండ్ డాన్స్ అనే టాస్క్ ఇచ్చారు.
ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోవాలి. వంటలు తయారు చేసుకోవాలి. బిగ్ బాస్ మ్యూజిక్ రాగానే డ్యాన్స్ చేస్తూ తయారు చేసుకునే పదార్ధాలు తినాలి. ఈ పోటీలో కుమార్ సాయి విజేతగా నిలిచాడు. అంతే స్థాయిలో టాలెంట్ చూపిన మెహబూబ్ దిల్ సే ని కూడా అభినందించారు. ఇదిలా ఉండగా… సరదాగా ఇలా టాస్క్ గేమ్స్ ఆడిస్తూ హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నామినేట్ అయిన స్వాతి దీక్షిత్, అభిజిత్, యాంకర్ లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సోహెల్ వరుసగా నిలబడ్డారు.
ఒక్కొక్కరు మూడు లెక్క పెట్టగానే తలకు పెట్టుకున్న తుపాకీ పేలిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి శబ్దం ఎవరి గన్ లో నుంది అయితే వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు. మామూలుగా అయితే రక్షించబడే క్యాండిడేట్ ఎవరో చెబుతూ వారి పేరును వివరిస్తారు. కానీ ఈసారి స్వాతి దీక్షిత్ పిస్టల్ తో కాల్చుకోగానే సౌండ్ వచ్చిన వెంటనే నాగార్జున ఎలిమినేటెడ్ అని చెప్పారు.
ఇంటి నుండి ఎవరిని సేవ్ చేయడం లేదు ఎలిమినేషన్ మాత్రమే చేశానని నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ ఇంటి సభ్యులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక ఇంటి సభ్యులందరూ స్వాతి తో సెల్ఫీ దిగి ఆమెను బయటకు సాగనంపారు.