Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యల గురించి అదేవిధంగా సినిమా టికెట్ ధరల గురించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతాల వారీగా ప్రభుత్వం ధరలను నియంత్రించటం పట్ల ఇండస్ట్రీకి చెందిన వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్ ధరలను వైసీపీ ప్రభుత్వం తగ్గించటం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు కూడా ఎటకారం కామెంట్లు సోషల్ మీడియాలో చేశారు.
పరిస్థితి ఇలా ఉంటే ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యల గురించి చిరంజీవి జనవరి మాసంలో సీఎం జగన్ తో పర్సనల్ గా సమావేశమయ్యారు. చిరంజీవి చెప్పే విషయాలను ముఖ్యమంత్రి జగన్ వినటం జరిగింది. ఇదే విషయాన్ని చిరంజీవి జగన్ తో భేటీ అయిన తర్వాత మీడియా దగ్గర మాట్లాడారు. త్వరలోనే మళ్లీ.. ముఖ్యమంత్రితో భేటీ జరుగుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు అపాయింట్మెంట్ ఖరారు కావడంతో… చిరంజీవి తో పాటు ఇండస్ట్రీ టాప్ హీరోలు మహేష్ బాబు అదేవిధంగా ప్రభాస్ మరి కొంతమంది సినీ ప్రముఖులు జగన్ తో భేటీ కోసం ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే ఈ భేటీ కి సంబంధించి ఆఖరి నిమిషంలో రావాల్సిన నాగార్జున హ్యాండ్ ఇచ్చాడు అని.. ఇది అందరికీ ఊహించని షాక్ అని అంటున్నారు. ఒక నాగార్జున మాత్రమే కాక జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా బాలకృష్ణ కూడా చివరి నిమిషంలో మీటింగ్ కి డుమ్మ కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో జగన్ కి అత్యంత సన్నిహితుల లో అక్కినేని నాగార్జున ఒకరు. గతంలో నాగార్జున కూడా వైఎస్ జగన్ తో పర్సనల్ గా బేటి కావడం జరిగింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన సమావేశం సమయంలో నాగార్జున చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం అటు రాజకీయంలో ఇటు ఇండస్ట్రీ పరంగా సంచలనంగా మారింది.