బిగ్ బాస్ నాలుగో సీజన్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా తయారవుతుందిղ ఈ వారం అయితే నామినేషన్ ప్రక్రియ నుండి రాజుకున్న మంట కంటెస్టెంట్ ల మధ్య ఇంకా చల్లారలేదు. వెంటనే నిర్వాహకులు తెలివిగా ‘బిగ్ బాస్ హోటల్’ టాస్క్ వారికి ఇచ్చేసి మీరు మీరు కొట్టుకొని చావండి మమ్మల్ని చేయండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దొరికిందే సందు అన్నట్లు అవినాష్ కి కూడా ఒక సీక్రెట్ ఇచ్చేసి హౌస్ లో వాతావరణం పూర్తిగా వేడెక్కించేశారు.
అంతా బాగానే ఉంది కానీ గతవారం ముగిసిన ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత ఎంతో మందికి ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అలాగే బయటకు వచ్చిన వారు కూడా ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. హోస్ట్ అక్కినేని నాగార్జున పై గత వారం బయటకు వచ్చిన స్వాతి దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందు నుండి బిగ్ బాస్ ఓటింగ్ పై అనుమానాలు ఎక్కువ. ఇక ఈ సీజన్ అయితే ఏదో తేడా జరుగుతున్నట్లు అందరికీఅనిపిస్తోంది.
ఇది ప్రజల నిర్ణయంతో ఎంతో జరగడంలేదని కావాలని నచ్చన వారిని నిర్వాహకులే హౌస్ నుండి బయటకు పంపిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. స్వాతి దీక్షిత్ కూడా ఓటింగ్ ను తప్పుపట్టడం కాకుండా నాగార్జున చేసిన కామెంట్స్ పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ఇంటిలో గేమ్ ఆడిన వాళ్ళను అలాగే ఎంటర్టైన్ చేసిన వాళ్లకు మాత్రమే సపోర్ట్ ఉంటుందని నాగార్జున చెప్పారని.. నిజంగా నాకు ఆ మాట ఆశ్చర్యానికి గురి చేసింది అని ఆమె అనింది.
హౌస్ లోనికి ఎంటర్ అయిన రెండు వారాలకే పంపించేయాల్సిన అవసరం ఏముంది అని…. ఇది నిజంగా దారుణం అని ఆమె అనింది. తన వంతు ప్రయత్నం తాను చేశానని.. నాగార్జున ఒక విధంగా తప్పుగా మాట్లాడారు అని ఏమీ చేయకుండా ఉంటే ఇలాగే ఎలిమినేట్ అవుతారని నాగార్జున అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని స్వాతి అనింది. ఇంకా తాను చేసినది అంతా ఎడిటింగ్ లో లేపేసినట్లు తనకు అర్థం అయినట్లు ఎక్కడో మోసం జరిగిందని ఆమె వివరణ ఇవ్వడం గమనార్హం