Eye Sight: జ్ఞానేంద్రియాలలో కళ్ళు కూడా ఒకటి.. అన్ని అవయవాల లో కళ్ళు ముఖ్యమైనవి కంటిచూపు లేనిది మనం దేనిని చూడలేము.. కంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి.. ఒకవేళ కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎటువంటి అలవాట్లను మానుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.. కంటి సమస్యలకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి..
Eye Sight: ఇవి తినాలి.. ఈ అలవాట్లను మార్చుకోండి..!!
మీ భోజనం తో మంచి కంటి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.. ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, లుటిన్, జింక్, విటమిన్ సి, ఇ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం మీ డైట్లో భాగం చేసుకోవాలి .ఇది కంటిశుక్లం, వయసు సంబంధిత దృష్టి సమస్యలను నివారించడంలో దోహద పడతాయి. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్లను రోజు తీసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. సాల్మాన్ ట్యూనా చేపలు తీసుకోవాలి. కోడిగుడ్లు, బీన్స్, నట్స్ తినడం మంచిది. సిట్రస్ పండ్లు, నారింజ పండ్లు లేదా రసాలు ఎక్కువగా తాగాలి. సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించడానికి చక్కటి కూలింగ్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ప్రతి 20 నిమిషాలకు మీ కళ్ళకి విశ్రాంతి తీసుకోండి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరం లో చూడండి. ప్రతి రెండు గంటలకు లేచి 15 నిమిషాలు విరామం తీసుకోండి.
ధూమపానం చేయడం వలన ఆ పిక్ నరాలు దెబ్బతినడం మాలిక్యులర్ డీజనరేషన్ వచ్చే అవకాశం మీకు దూమపానం తాగే అలవాటు ఉంటే. ముందుగానే మీరు ఈ అలవాటును వదిలించుకోండి. మీరు కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. కంటిపై భారం పడవచ్చు. దూర దృష్టి సమస్య, తలనొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
Eye Sight: కంటి సమస్యలకు ఇంటి చిట్కాలు..!!
కొన్ని నందివర్ధనం చెట్టు పూలు తీసుకొని నీటిలో కడగాలి. ఒక గ్లాసు నీటిలో వేసి రెండు గంటల తర్వాత ఆ నీటిలో కళ్ళు కడుక్కుంటే కళ్ళల్లో మంట తగ్గి తేటగా అవుతాయి. కంటిపై పెట్టుకుని చిన్న గుడ్డ కప్పి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే కళ్ళల్లో మంట తగ్గుతుంది. కంటికి నిద్ర కు అవినాభావ సంబంధం ఉంది కంటినిండా నిద్ర పోవటం అనేది ఏమి చేస్తుంది ఉంది తక్కువగా నిద్రపోతే పనుల పై ప్రభావం పడుతుంది . ఒక స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకుని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయం ఈ నీటిని వడపోసుకోవాలి. ఈ నీటితో కళ్ళు కడుక్కుంటే నేత్ర సమస్యలు తగ్గుతాయి. త్రిఫల చూర్ణం, నెయ్యి, తేనె సమపాళ్లలో కలిపి తీసుకుంటే కంటిచూపు మెరుగవుతుంది. మారేడు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. తయారు చేసుకున్న మారేడు కషాయానికి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. రేచీకటి సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆవ నూనెతో మర్దన చేసుకోవాలి ఇలా ఆవ నూనెతో మర్దన చేసుకుంటే కంటి సమస్యలు రావు. కంటిలో దుమ్ము ధూళి పడితే కళ్ళు ఎర్రగా మారి మంట వస్తుంటే కొన్ని జామ ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరుకోవాలి జామ ఆకుల ముద్దను కళ్ళపై పెట్టుకుని పడుకోవాలి ఇలా చేస్తే త్వరగా కళ్ళ మంటలు తగ్గుతాయి. కళ్ళకలక వచ్చినప్పుడు పట్టికను వేడిచేసి నీటిలో కరిగే కాళ్ళు కడుక్కుని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఆవు నెయ్యి, పంచదార కలిపి రోజుకు మూడుసార్లు తినాలి. త్రిఫల కషాయాన్ని పాలలో కలిపి రోజుకు రెండు సార్లు తాగితే కంటి కలక తగ్గిపోతుంది. కంటి ఆరోగ్యానికి కి జ్ఞానముద్ర ధ్యానముద్ర చక్కగా పనిచేస్తాయి . వీటితోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
Read More :
Vakkaya: వామ్మో వాక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..!!
Vitamin K: ఎముకలు గుల్ల బారకుండా ఉండడానికి.. ఈ విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?