Sonu Sood: కరోనా కష్టకాలంలో పేదలను.. సామాన్యులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు సెలబ్రిటీల కంటే ముందు ఉన్నవాడు ఆపద్బాంధవుడు మానవత్వంలో హీరోలకే హీరో సోను సూద్. కరోనా రాకముందు చాలా మంది హీరోలు ఆడియో ఫంక్షన్ లలో అనేక ఇంటర్వ్యూలలో మేము వారికి సహాయం చేస్తాం, మేము వీరికి సహాయం చేయడం జరిగింది.. అంత గొప్ప, ఈయన ఇంత తోపు… అంటూ ఎవరికి వారు సెల్ఫ్ డప్పు కొట్టుకున్నారు. కానీ మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకోవటంతో వలస కూలీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఆ సమయంలో ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో సోనూసూద్ ముందుకు వచ్చి సొంత డబ్బులతో అనేకమంది వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.
ఆ తర్వాత అనేక మంది పేదలకు ఉపాధి కల్పిస్తూ.. పేదవాళ్ల పిల్లలను చదివిస్తూ, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తూ అనేక రీతులుగా సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనేకమంది ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రాణాలను నిలబెట్టడం జరిగింది.
Read More: Sonu Sood: తెలుగు యాంకర్ చేసిన పనికి ఫిదా అయిపోయిన సోనుసూద్!!
దాదాపు తన చారిటీ సంస్థ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడుతూ మరి కొంత మందికి సహాయం చేస్తూ సోనుసూద్ నిరంతరం దేశంలో క్లిష్ట సమయంలో ఆపద్బాంధవ అవతారం ఎత్తి అనేక మంది పేదలను, కరోనా రోగులను ఆదుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మరియు సెలబ్రిటీలు అదేవిధంగా కోట్లు సంపాదించిన కోటీశ్వరులు కూడా సరైన రీతిలో స్పందించని సమయంలో సోనుసూద్ స్పందిస్తున్న తీరు సోషల్ మీడియాలో నెటిజన్లని ఆకట్టుకోవడం జరిగింది. దీంతో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు అందించాలని సత్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్ మీడియాలో #padma vibhushan for Sonu Sood హాష్ టాగ్ తో వైరల్ చేస్తున్నారు. భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?