Seeds: మనం తీసుకునే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. ఆరోగ్యకరం ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వ్యాయామం ఒక్కట్టే ఆరోగ్యానికి సరిపోదు.. దానికి తగిన ఎంత పోషకాహారాన్ని కూడా తీసుకోవాలి.. ఇప్పుడు మనం చెప్పుకోవాలి గింజలను వేరువేరుగా నానబెట్టుకుని పరగడుపున తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది..!! అవేంటంటే..!?
మెంతులు, ఎండు ద్రాక్ష ,అవిస గింజలు, బాదం పప్పు వీటిని విడివిడిగా రాత్రి పూట నాన పెట్టుకొని ఉదయం పరగడుపున తినాలి. గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగితే.. మహిళలలో సాధారణంగా వచ్చే కీళ్ళు, నడుము, వెన్ను నొప్పులను తగ్గిస్తుంది. స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. అవిసె గింజలను కూడా రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం పరగడుపున తింటే బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. మధుమేహం నుంచి క్యాన్సర్ వరకు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.
బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. బాదం పప్పును నేరుగా తినడం కంటే నానబెట్టుకుని తింటేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి లను సమతుల్యం చేస్తుంది. ఎండుద్రాక్షలు కూడా రాత్రి నానబెట్టుకుని ఉదయం తింటే చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.