సాధారణంగా మన దేశంలో నిర్భయ కేసు ఎంత బలమైనదో తెలిసిందే. ఈ కేసు ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా మహిళను లేదా బాలికను బలవంతం చేస్తే అతను ఖచ్చితంగా జైలు పాలు కావడమో లేదా ఉరికంభం ఎక్కడమో జరుగుతుంది. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం ఈ ట్రెండ్ కు స్వస్తి చెప్పింది. ఇక్కడ బాధితురాలి వాదనతో పాటు ఎవరైతే ఆమెను బలవంతం చేశారు అని చెప్పబడుతున్నారో…. వారి తరఫున కూడా ఆలోచించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక హైకోర్టు జడ్జి కృష్ణ దీక్షిత్…. రాకేష్ అనే ఒక ముద్దాయికి కనీవినీ ఎరుగని రీతిలో నిర్భయ కేసు కింద అతని పై ఉన్నా…. యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడం విశేషం. లక్ష రూపాయల పూచీ కత్తుతో మరియు ఇద్దరు షూరిటీలతో అతనికి బెయిలు జారీ చేశారు. అయితే సాధారణంగా నిర్భయ కేసుకు సంబంధించి ముద్దాయికి బెయిల్ వంటివి లభించవు కానీ ఇక్కడ బాధితురాలు చెప్పిన కథలో జడ్జి లోపాలను గుర్తించడమే కాకుండా ఆమెను ఎదురు ప్రశ్నలు కూడా వేశారు.
విషయం ఏమిటంటే సదరు బాధితురాలు రాత్రి పదకొండు గంటలకి ఎవరైతే తనను బలవంతం చేశారు అని చెప్తుందో… అతని ఆఫీసుకి వెళ్ళింది. అలాగే అతనితో కలిసి మద్యం కూడా సేవించింది. ఇకపోతే తను బలవంతానికి కి గురి అయిన తర్వాత వెంటనే బయటికి రాలేదు… గగ్గోలు పెట్టే లేదు సరికదా అక్కడే పడుకొని నిద్రపోయి తెల్లవారుజామున లేచి ఇంటికి వెళ్ళింది.
ఇక ఇవన్నీ కాకుండా ఆమె అంత రాత్రి వేళ అతని ఆఫీస్ కి ఎందుకు వెళ్ళిందో సరైన సమాధానం చెప్పలేదు. అదీ కాకుండా ఆమె పై బలవంతం జరిగిన వెంటనే పోలీసులు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇకపోతే వారు మద్యం సేవించమని అడిగినప్పుడు తను కాదనకుండా తీసుకుంది. వీటన్నింటినీ పరిగణించిన జడ్జి ఆమె వాదన బలంగా లేదని గ్రహించి… ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్ణయం దేశ న్యాయవ్యవస్థ లోనే ఒక సంచలనంగా మారింది.