NPC: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తరువాత పెద్ద మొత్తంలో గ్రాడ్యుటీ రావడంతో నెల నెలా పెన్షన్ వస్తుంది. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇతర వర్గాలు కూడా రిటైర్ అయిన తరువాత అంటే 40 సంవత్సరాల దాటిన తరువాత ప్రశాంతంగా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. జాతీయ పెన్షన్ విధానం (ఎన్పిఎస్) ఎంపిక చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రభుత్వ పథకం. నెలవారీ రూ.500ల చొప్పున సంవత్సరానికి రూ.6వేలు పొదుపు చేసుకోవచ్చు. 18 నుండి 70 సంవత్సరాల మద్య వయసు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథంలో చేరవచ్చు.
దేశంలో జీతం, స్వయం ఉపాధి నిపుణులు, ఫ్రీలాన్సర్లకు అందుబాటులో ఉన్న ఆదర్శవంతమైన పెన్షన్, రిటైర్ మెంట్ పథకాలలో ఎన్పిఎస్ పథకం ఒకటి. ఎన్పిఎస్ కింద ఖాతా తెరవడం చాలా సులభం.
ప్రయోజనాలు
రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వారు ఎంచుకున్న ఎన్ పీ ఎస్ ఖాతా రకాన్ని బట్టి 9 నుండి 12 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఆదాయపన్ను మినహాయింపు కూడా ఈ స్కీమ్ కు ఉంది. ఎన్ పి ఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు లక్షల రూపాయల వరకూ ఆదాయపన్ను మినహాయింపు పొందవచ్చు. జాతీయ పెన్షన్ విధానం ప్రకారం ఖాతాదారుడు 60 సంవత్సరాల వయస్సు తర్వాత 60 శాతం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 60 సంవత్సరాలు కంటే ముందు నగదు కావాలంటే 25 శాతం ఉపసంహరించుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద మొదటి మూడు సంవత్సరాల నిరంతరం పెట్టుబడి పెట్టాలి.