NTR : కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న సినిమా రిలీజ్ అయినా కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరికి వారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగానే “క్రాక్” సినిమా రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ..అందరు బేషజాలు పక్కనబెట్టి “క్రాక్” సినిమాని బాగా సపోర్ట్ చేయటం జరిగింది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రిలీజ్ అయిన మెగా హీరో సినిమా “ఉప్పెన” ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా విజయం సాధించటంలో మరియు ప్రమోషన్ లో తనవంతుగా సపోర్ట్ చేయటం మనకందరికీ తెలిసిందే.
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అదిరిపోయే విజయం సాధించడం మాత్రమే కాక భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. కాగా తాజాగా మరో యంగ్ హీరో నితిన్ సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే నితిన్ నటించిన “రంగ్ దే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి కావటంతో..నితిన్ అండ్ “రంగ్ దే” టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే మరింతగా సినిమాకి బెనిఫిట్ అవుతుందని భావిస్తూ, ఎలాగో ప్రస్తుతం చాలా వరకు ఎన్టీఆర్ వస్తున్న సినిమాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ..నితిన్ ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకురావడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఎన్టీఆర్ లాంచ్ చేసిన “ఉప్పెన” ట్రైలర్ సూపర్ సూపర్ హిట్ కావడంతో ..ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఫిలిం మేకర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కర్నూల్ పట్టణంలో మార్చి 19వ తారీకు జరగనున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?