NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా మొదటిసారి వచ్చిన కరోనా ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొందో.. రెండోసారి మాత్రం అదేరీతిలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వాలు అంచనాకు మించి మహమ్మారి భయంకరంగా పాకిపోయింది. దీంతో కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక .. మరణిస్తున్న పరిస్థితి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేకమంది స్టార్ హీరోలు సైతం కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇదిలా ఉంటే తనకు అంతా బాగుందని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా సాక్షిగా ఎన్టీఆర్ తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కోలుకోవాలని చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్.. కూడా ఎన్టీఆర్ కి జాగ్రత్తలు చెబుతూ పోస్టులు పెట్టారు. టేక్ కేర్ అంటే చంద్రబాబు మరియు నారా లోకేష్ పోస్ట్ లు పెడుతూ నీ తో పాటు కుటుంబ సభ్యులందరూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ కూడా స్పందిస్తూ.. “గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్” అని ట్వీట్ చేశారు. ఇంకా అనేకమంది ఎన్టీఆర్ కోలుకోవాలి అని సోషల్ మీడియా సాక్షిగా తెలియజేశారు.