శిరోముండనం కేసులో అరెస్టయిన ప్రముఖ రాజకీయవేత్త నూతన్ నాయుడు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంట్లో దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేయించిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఘటనలో నూతన్ నాయుడు భార్య తో పాటు కుటుంబ సభ్యులను, ఇంట్లో పనిచేసే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నూతన్ నాయుడు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్ లో పరారీ లో ఉన్న అతనిని అరెస్టు చేశారు.
ఇక ఎప్పుడైతే నూతన్ నాయుడు అరెస్టు జరిగిందో ఆయన బాధితులు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుండి ఇద్దరు బాధితులు నూతన నాయుడు పై కొత్త కేసులు పెట్టారు. వీరిద్దరి దగ్గర నుండి నాయుడు ఏకంగా 12 కోట్లు వసూలు చేశాడట. శ్రీకాంత్ రెడ్డి అనే అతనికి ఎస్బిఐ లో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానని 12 కోట్లు తీసుకున్నాడట. అలాగే నూకరాజు అనే మరో వ్యక్తి దగ్గర ఎస్బిఐ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరి కన్నా ముందు ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తానని చెప్పి భారీగానే వసూలు చేసినట్లు బాధితుల కథనం ప్రకారం అర్థమవుతోంది.
ఇక సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వసూలు చేసిన ఘటనలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి అసలు నూతన నాయుడు ఎప్పుడూ ఇలాగే మోసాలు చేస్తూ ఉంటాడు… అన్న క్లారిటీ అయితే పోలీసులకు వచ్చేసినట్లు సమాచారం. కొందరితో వ్యాపారాలు చేస్తున్నారు అని…. మరికొందరితో తనకు సాఫ్ట్వేర్ పరిశ్రమ ఉందని…. ఇదే సందర్భంలో టిడిపి-జనసేన పార్టీలో కీలక వ్యక్తులు కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయంగా కూడా తను ప్రముఖుడనే అని చెప్పుకునే నూతన్ నాయుడు అటు వైసిపి మనిషిగా కూడా చలామణి అవుతున్నాడు.
ఇలా ఒక్కొక్కటి అసలు నూతన్ నాయుడు గురించి బయటకు వస్తున్నవి చూసి ఇతని మీద ఒక సినిమా తీసేయొచ్చు అన్ని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.