Online Money Transfer : మార్చి 31 , ఏప్రిల్ 1వ తేదీల్లో దేశం లో ఉన్న చాలామంది బ్యాంకింగ్ వినియోగదారులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఆ రెండు రోజులు చాలామంది IMPS, RTGS, NEFT, UPI పరంగా సమస్యలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో తాము అవతలి వారికి పంపిన నగదు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయింది.. కానీ, అవతలి వారికి ఆ నగదు ఇంకా క్రెడిట్ కాలేదు..! దీనిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా National Payments Corporation of India వివరణ ఇచ్చింది..!!
మార్చి 31 వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు.. ఏప్రిల్ 1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు మామూలుగానే డౌన్ అవుతాయి.. అందువలన అనేక మంది వినియోగదారులు ట్రాన్సాక్షన్ లు ఫెయిల్ అయ్యాయి.. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కావున వినియోగదారులు ఆయా సేవలను ఎథావిధంగా ఉపయోగించుకోవాలని NPCI వివరణ ఇచ్చింది.. అంతే కాకుండా బ్యాంకు ఎకౌంటు నుంచి నగదు డెబిట్ అయ్యి.. అవతలి వారికి కూడా క్రెడిట్ అవ్వకపోతే.. వినియోగదారులు ట్రాన్సాక్షన్ అయినా సమయం నుంచి ఒక రోజు వేచి చూడాల్సి ఉంటుంది.. ఆ లోపు కచ్చితంగా నగదు వారికి గాని, అవతలి వారికి కానీ క్రెడిట్ అవుతుంది.. ఒకవేళ ఆ విధంగా కూడా క్రెడిట్ జరగకపోతే.. సంబంధిత బ్యాంకు లకు ఫిర్యాదు చేయాలి . దీంతో ఒక రోజు ముగిసిన తర్వాత నుంచి నగదు క్రెడిట్ అయ్యే వరకు రోజుకు రూ.100 చొప్పున బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లిస్తాయి. ఇక నెలరోజులు అయినప్పటికీ ఇంకా క్రెడిట్ అవ్వకపోతే వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలి.