Vijay Deverakonda: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో.. థియేటర్లు క్లోజ్ అవడంతో… పాటు ప్రేక్షకులకు కరోనా భయం పట్టుకోవడంతో సినిమా థియేటర్లకు భవిష్యత్తులో ఆడియన్స్ వచ్చే పరిస్థితి తక్కువ ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓటిటి సంస్థలకి భారీగా గిరాకీ పెరగడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో “లైగర్” కి ప్రముఖ ఓటిటి.. సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కుల తో కలిపి డిజిటల్ రైట్స్ మొత్తం 200 కోట్లు సదరు ఓటిటి సంస్థ ఆఫర్ ఇవడం జరిగిందట. మొత్తం అన్ని భాషల శాటిలైట్ హక్కులు కలిపి ఈ ధర నిర్ణయించినట్లు సమాచారం. కానీ పూరి జగన్నాథ్ మాత్రమే ఈ సినిమాని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. పూరి జగన్నాథ్ ఈ సినిమా తన కెరీర్ లో ఓ మరపురాని చాలా స్పెషల్ సినిమా అంటూ గతంలో తెలపటంతో సినిమా కోసం సామాన్య ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Read More: Liger : ఒక్క క్లైమాక్స్ లైగర్ సినిమాకి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందట..!
సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే పోస్టర్ బట్టి అర్థమవుతుంది. అదే రీతిలో సినిమాలో ప్రపంచం బాక్సర్ .. మైక్ టైసన్ చేత గెస్ట్ పాత్ర సినిమా యూనిట్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో మరింతగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?