Pakistan : పాకిస్తాన్ లో రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది.. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.. ఇటువంటి సమయంలో కరోనా టీకాల దొంగతనం చోటుచేసుకుంది. పాకిస్తాన్ లోని లాహోర్ ఆసుపత్రి లో 550 వ్యాక్సిన్ డోసులు దొంగతనం జరిగాయని ఆరోగ్యశాఖ ఉన్నత అధికారుల విచారణలో తేలింది.. ఇదే ఆసుపత్రి లో 350 వ్యాక్సిన్ డోసులు వృధా అవడం గమనార్హం..
ఒకవైపు వ్యాక్సిన్ వృధా కావడం.. మరోవైపు దొంగతనం జరగడంతో ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. వృధా కు కారణమైన మెడికల్ సూపర్డెంట్ ను సస్పెండ్ చేశారు. అయితే దొంగలించిన కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రముఖులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. డోసుల దొంగతనం పై అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. పాకిస్తాన్ లో కరోనా సెకండ్ వేవ్ రావడంతో దాన్ని నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.