నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐఐఎఫ్ టి ఎగ్జామ్ ను నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తుంది. మేనేజ్మెంట్ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోగల ప్రముఖ సంస్థల్లో ఒకటి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల పై ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి గమ్యం.
ఐఐఎఫ్ టి లో ప్రవేశానికి ప్రతి సంవత్సరం 55000 లకు పైగా అభ్యర్థులు పోటీ పడతారు. ఇందులో అర్హత సాధించిన వారు ఎంబీఏ ఐబి- ఇంటర్నేషనల్ బిజినెస్ లో ప్రవేశం పొందుతారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా మూడు క్యాంపస్ ల్లో ఢిల్లీ, కాకినాడ కోల్ కతా లో అడ్మిషన్ అవకాశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. కోర్ అంశాలతోపాటు ఎలక్టివ్ ను ఎంచుకోవచ్చు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ 6.50 లక్షల లోపు ఉన్నవారు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ :
సంస్థ వెబ్ సైట్ నందు దు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రుసుము 2500. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి వారికి రూ.1000. వెనుకబడిన వర్గాల వారు పది, ఇంటర్, డిగ్రీ, ఫోటో, సంతకం, ఉన్న వారు సంబంధిత పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
చివరి తేదీ : 20/12 /2020. పరీక్ష తేదీ : 24 01 20 21.
వెబ్సైట్ : http://www.iift.edu
అర్హతలు :
ఏదైనా డిగ్రీ లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి కి చెందిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు.
ప్రశ్నాపత్రం ఇలా :
ఇది కంప్యూటర్ ఆధార్ పరీక్ష. సమయం 2 గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అనాలసిస్, రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. విభాగం, అడిగే ప్రశ్నలు బట్టి మార్కుల్లో మార్పులు ఉంటాయి.
ఎంపిక విధానం :
ఈ పరీక్షలు మూడు దశల్లో నిర్వహిస్తారు. రిటెన్ ఎబిలిటీ టెస్ట్, బృంద చర్చ, వ్యక్తిగత ఇంటర్వ్యూ లలో సాధించిన స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఒక ఎస్సేను కూడా రాయాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారికి అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా కట్ ఆఫ్ ను నిర్ణయిస్తారు. తరగతుల్లో అకడమిక్ పరంగా సాధించిన మార్కులు, కోర్సుల్లో వైవిధ్యం, లింగ వైవిధ్యం, పని అనుభవానికి మార్కులు ఇస్తారు. వీటిలో అర్హత సాధించాక బృంద చర్చను నిర్వహిస్తారు. దీనిలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, బృందంతో కలిసి పనిచేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై ఏ విధంగా స్పందిస్తున్నారు పరిశీలిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తంగా సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్ఆర్ఐలకు జీ మ్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.