Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను దుమారంగా మారింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi).. ఇటీవల కర్ణాటకలో మీడియా సమావేశం నిర్వహించి పవిత్ర లోకేష్(Pavithra Lokesh).. నా భర్త నరేష్ నీ నాకు దక్కకుండా చేస్తుందని ఆరోపించింది. ఇదే సమయంలో తనకు విడాకులు ఇవ్వకుండానే గత కొన్నాళ్ల నుండి పవిత్ర లోకేష్.. నరేష్ ఒకే చోట ఉంటున్నారని సహజీవనం చేస్తున్నారని మండిపడింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడాకులు ఇవ్వకుండా నరేష్(Naresh) ఈ విధంగా వ్యవహరించడం దారుణమని మీడియా ముందు వాపోయింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం మైసూర్ హోటల్ లో.. నరేష్, పవిత్ర లోకేష్ లపై రమ్య దాడికి పాల్పడటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఈ వ్యవహారంలో తాజాగా పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర(Suchendra) ఎంటర్ అయ్యాడు. పవిత్ర లోకేష్ ముమ్మాటికి నా భార్య అని పేర్కొన్నారు. మేమిద్దరం భార్యాభర్తలు అని కర్ణాటక రాష్ట్రం మొత్తానికి తెలుసు. అంతేకాదు మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పవిత్ర లోకేష్ పాస్ పోర్ట్ పై భర్తగా నా పేరు ఉంటుంది. ఇక నా పాస్ పోర్ట్ లో… ఆమె పేరు ఉంటుంది. పవిత్ర విడాకులు ఇవ్వలేదు, ఇంకా మేమిద్దరం భార్యాభర్తలుగానే ఉన్నాం అని అన్నారు.
ఇదే సమయంలో నరేష్…ఎవరో కూడా తనకు తెలియదని సుచీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం షూటింగ్ లు కోసమే తన భార్య… పవిత్ర.. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో నరేష్ తో తన భార్యకు ఏఫైర్ ఉందా లేదా.. అనే విషయం తనకి తెలియదని.. ప్రస్తుతం జరుగుతున్న గొడవ స్నేహితులు చెబితేనే తెలిసిందని పవిత్ర లోకేష్ భర్త సుచీంద్ర పేర్కొన్నారు. దీంతో సుచీంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.