Pawan Kalyan: దాదాపు సినిమా ఇండస్ట్రీకి మూడు సంవత్సరాల దూరమవడంతో.. ఒక్కసారిగా వచ్చిన గ్యాప్ తో అభిమానులను నిరాశ పడుతుండటంతో ఆకలి తీర్చడానికి పవన్ అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఏ హీరో చేతిలో లేని ప్రాజెక్టులు ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్నాయి. వీలైనంత ఎక్కువ సినిమాలు చేయాలని వచ్చే ఎన్నికలకు సంవత్సరం ముందు లోపు భారీగా సినిమాలు చేసి… ప్రేక్షకులను అలరించాలని పవన్ డిసైడ్ అయినట్లు సన్నిహితులు నుండి అందుతున్న టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటికే “వకీల్ సాబ్” .. కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయగా.. ఆ తర్వాత రానా తో మల్టీస్టారర్ సినిమా చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే మొగల్ సామ్రాజ్యం కాలంనాటి పౌరాణిక సినిమా చేస్తూ ఉన్నారు.
రానా తో మల్టీస్టారర్ క్రిష్ 2 సినిమా షూటింగులు.. యధాతధంగా జరుగుతూ ఉన్నాయి. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో.. మరి కొద్ది నెలల్లో పవన్ సినిమా చేయబోతున్నారు. ఈ మూడు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ కలిగిన స్క్రిప్ట్ లో నటించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా గురించి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
ఉత్తరాది.. దక్షిణాది సినీ ప్రేమికులను అలరించే రీతిలో ఈ స్క్రిప్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. రెడీ చేసినట్లు పవన్ చేతిలో ఉన్న ప్రస్తుతం సినిమాల షూటింగ్ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయిన వెంటనే.. ఈ పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టే ఆలోచనలో మాటల మాంత్రికుడు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో అందుతున్న టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నారు. ఆలోపు పవన్ మూడు ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.