సాధారణంగా మనుషులతప్పిపోయినప్పుడు లేదా ఒక పెద్ద క్రిమినల్ గురించి, ఒక టెర్రరిస్ట్ గురించి లేదా, ఒక దొంగ గురించి ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటిస్తారని విన్నాము. కానీ కోతి ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా యాభై వేలు నజరానా ప్రకటించడం ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ కోతి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు నజరానా ప్రకటించారు అనేది తెలుసుకుందాం…
పంజాబ్ లోని చండీఘర్ కు చెందిన పచ్చబొట్టు వేసే ఆర్టిస్ట్ కమల్ జిత్ సింగ్, ఇంకా అతని మేనేజర్ దీపక్ ఓహ్రా ఎంతో ఇష్టంగా ఒక కోతిని పెంచుకుంటున్నారు. వన్యప్రాణులను పెంచుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి, వీరిద్దరిని గత ఆగస్టు నెల పోలీసులు అరెస్టు చేశారు. అయితే మరుసటి రోజు బెయిల్ పై విడుదలయ్యారు.
వారు ఒక కోతిని పెంచుకోవడం వాస్తవమేనని, అయితే అలా పెంచుకోవడం చట్టరీత్యా నేరమని తెలిసి ఆ కోతిని అడవిలోకి వదిలి పెట్టామని చెప్పారు. కానీ మీరు చెప్పిన మాటలలో నిజం లేదని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ వీరిపై కోర్టులో పిటిషన్ వేసింది.
వీరి కేసును విచారణ చేపట్టిన కోర్టు వీరు కోతిని అడవిలో వదిలి పెట్టామని చెప్పిన కోర్టు వినకుండా, తగిన సాక్ష్యాధారాలతో కోర్టు ముందు హాజరుపరచాలని, సూచిస్తూ ఈ కేసును కోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే వీరి దగ్గర కోతిని అడవిలో విడిచిపెట్టినట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కోతి ఆచూకీ కోసం అడవి మొత్తం గాలిస్తున్నారు.
ఈ కేసుపై కోర్టుకు వెళ్లిన స్వచ్ఛంద సంస్థ కూడా ఈ కేసును చాలా తీవ్రంగా తీసుకుంది. ఎంత వెతికినా వీరికి కోతి ఆచూకీ తెలియనప్పటికీ, కోతి ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నజరానా ప్రకటిస్తున్నట్లు తెలిపారు అయితే కోతి ఆచూకీ కోసం నజరానా ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.