Petrol diesel Price: దేశ వ్యాప్తంగా ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గత 17 రోజుల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటం ఇది మూడోవ సారి. మార్చి 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. గడచిన 17 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇంథన ధరలు లీటరుకు రూ.10 వరకూ పెరిగాయి.
ఇంథన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం..ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబాయిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.120.51, 104.77గా ఉన్నాయి. చెన్నై లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85లు, డీజిల్ ధర 100.94, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.115.12, డీజిల్ ధర రూ.99.83గా ఉంది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.42, విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.121.20, డీజిల్ ధర రూ.106.82, విశాఖలో పెట్రోల్ రూ.120.81, డీజిల్ రూ.105.59లుగా ఉంది.
రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ధరల పెరుగులదపై ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా, ఇంధన ధరల పెంపుపై కేంద్రం సమర్ధించుకొంటోంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇటీవల లోక్ సభలో ఇంధన ధరల పెరుగుదలపై సమర్ధిస్తూ.. రాష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తరువాత భారత్ లో పెట్రోల్ ధరలు కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 50 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకొచ్చారు. గురువారం పెట్రోల్ ధరలు పెరగకపోవడంతో వాహనదారులు కాస్త ఊరట చెందారు.