Petrol Diesel price: దేశంలో పెట్రోల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. త్వరలో లీటరు రూ.140 దాటే అవకాశాలు కనబడుతున్నాయి. గడచిన 15 రోజుల్లో 14 సార్లు ధరలు పెరిగాయి. తాజాగా నేడు పెరిగిన 80 పైసలతో లీటరుకు రూ.10లు పెరిగినట్లు అయ్యింది. గతంలో మాదిరిగా పది పైసలు, పదిహేను పైసలు కాకుండా ఇప్పుడు 40 పైసలు, 80 పైసలు చొప్పున పెంచుతున్నారు. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో సామాన్య, మద్య తరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగాయనీ ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువేనని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు వంతున పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో .. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41 లకు, డీజిల్ లీటరు రూ.96.67కి చేరుకుంది. ముంబాయిలో 84 పైసల పెరుగుదలతో పెట్రోల్ లీటర్ రూ.120.51, డీజిల్ రూ.104.77లకు పెరిగింది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49లకు పెరగ్గా డీజిల్ ధర 105.42లకు పెరిగింది. కరీంనగర్ లో లీటరు పెట్రోల్ ధర రూ.119.31లు, డీజిల్ ధర రూ.104.60లకు చేరింది. ఇక విజయవాడలో 88 పైసల పెరుగుదలతో లీటరు పెట్రోల్ ధర రూ.121.20కి చేరగా, డీజిల్ 84 పైసల పెరుగుదలతో రూ.106.82 కి పెరిగింది. విశాఖలో పెట్రోల్ ధర రూ.120.81లు చేరగా, డీజిల్ ధర రూ.105 59 లకు చేరింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?