Piles: ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాటిలో మొలలు ఒకటి.. దీనిని ఫైల్స్, మూలశంక అని పిలుస్తారు.. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడటాన్ని ఫైల్స్ అంటారు.. కొందరిలో వాపు కనిపించకపోయినా, దీని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.. దీని బారిన పడిన వారికి మలవిసర్జన సమయంలో నొప్పి వస్తుంది. ప్రతిసారి నొప్పి రావటం, మంట, రక్తం కారడం వంటివి జరుగుతాయి. ఒకే చోట కూర్చుని పనిచేసే వారిలో ఫైల్స్ సమస్య ఎక్కువగా వస్తుంది.. ఆయుర్వేద వైద్యంలో పైల్స్ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి..!! వాటిని పాటిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి..!!
Piles: ఫైల్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా..!!
కుంకుడు కాయ పై బెరడు దోరగా వేయించుకొని పొడిచేసుకోవాలి. దీనిని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. కవిరి లేదా కఫరి ని 20 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండింటిని బఠాణీ గింజంత పరిమాణంలో గోలీలు గా తయారు చేసుకోవాలి. వీటిని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తరువాత గోలీలను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. వీటిని ప్రతి రోజూ ఉదయం మద్ది మధ్యాహ్నం రాత్రి తినే ముందు ఒక గ్లాసు మజ్జిగలో కాని ఒక గ్లాస్ కుండలోని నీరు లో వెన్నతో లేదా నెయ్యి తో కలిపి తీసుకోవాలి.. వీటిని ప్రతిరోజు వేసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది. ఈ మందులు భంగదరాలకి, ఫిసర్స్ కి చక్కగా పనిచేస్తాయి. వీటిని వేసుకుంటూనే మొలలు ఉన్నచోట లేపనాన్ని కూడా రాసుకుంటే అంటే త్వరగా తగ్గుతాయి.
Piles: మొలలు కు ఈ లేపనం రాయండి..!!
పొగాకు కాడలు ఒక కేజీ తీసుకొని వాటిని ఎండలో ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ఆకులను పొడి చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. 4 స్పూన్ల ఈ పొడి నీ వేసుకుని కొంచెం నీరు కలిపి మిశ్రమం లా తయారు చేసుకోవాలి. వారు చేసుకున్న మిశ్రమాన్ని ఫైల్స్, ఫిస్తులా, ఫిస్సర్స్ ఉన్న చోట రాయాలి. ఒక గంటన్నర పాటు వరకు ఉంచి తర్వాత కడిగేయాలి. ఈ రోజుల్లో మీకు కుదిరిన సమయంలో లో నీ లేపనాన్ని రాస్తే త్వరగా సమస్య తగ్గుతుంది.
ఈ చూర్ణం మందులు వాడుతున్న అన్ని రోజులు పత్యం పాటించాలి.
వేడి వేడి ఆహార పదార్థాలు తినకూడదు. అజీర్తి చేసే పదార్థాలు తినవద్దు. మసాలా వస్తువులు, వంకాయలు, మాంసాహారం తీసుకోకూడదు. ఈ చూర్ణం మందులు రోజూ పెరుగన్నం లేదా మజ్జిగ అన్నం తినాలి అలాగే ప్రతిరోజు ముల్లంగి తో చేసిన కూర, పచ్చడి ఆహారంలో తీసుకోవాలి.