Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు తెలియజేస్తూ ఉంటారు.. ప్రతి నిత్యం ఏదో విషయం పై ఆయన స్పందిస్తూ ఉంటారు.. గుజరాత్ రాష్ట్రంలోని అడవిలో 3 వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో షేర్ చేసింది.. ఈ వీడియోపై మోడీ స్పందించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వీడియోపై అద్భుతం అని ట్వీట్ చేశారు..!!
గుజరాత్ లోని భావనగర్ లో గల కృష్ణజింకల జాతీయ పార్క్ లో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో చెంగు చెంగున ఎగురుతూ రోడ్డు దాటుతున్న వీడియో మోడీ అద్భుతం అని షేర్ చేయడంతో అందర్నీ ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఈ వీడియో పై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో ను 72 వేల మంది లైక్ చేయగా పదివేల మంది షేర్ చేశారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి మంచి అంశాలపై స్పందిస్తారు కాబట్టే తన ట్విట్టర్ ఖాతాలో 70 మిలియన్ల ఫాలోవర్ లను సొంతం చేసుకోగలిగారు.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021