దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను గమ్య స్థానం లో చేర్చడానికి సొంత డబ్బులతో ప్రత్యేకమైన రైళ్లు విమానాలు బస్సులు నడిపాడు. ప్రభుత్వాలు కూడా ముందుకు రాని సమయంలో సోను సూద్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అనేక మందిని ఆదుకున్నాడు. దేశంలో చాలా మంది హీరోలు ఉన్న కానీ సరైన సమయంలో సహాయానికి ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు.
అంతేకాకుండా ఇప్పటికీ కూడా తన సేవలు పేదవాళ్లకు అందే రీతిలో ప్రత్యేకమైన టీమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సాయం అందిస్తున్నారు. అటువంటి సోనూసూద్ పై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ముంబైలో ఓ ఆరు అంతస్తుల భవనాన్ని మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా హోటల్ గా మార్చి వ్యాపారం చేస్తున్నారని సోనూ పై పోలీసులకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై సోనుసూద్ స్పందించాడు.
బీఎంసీ పర్మిషన్ తీసుకున్నానని..వాటికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్మిషన్ ఇంకా రావలసి ఉందని, కరోనా నేపథ్యంలో అనుమతులు రాలేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో హోటల్ తప్పనిసరిగా తొలగించాలని ఆదేశిస్తే తొలగిస్తాం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోనుసూద్ హైదరాబాదులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్లో ఉన్నారు.