Police Constable: పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ విధి నిర్వహణలో భాగంగా.. పెద్దదోర్నాల మండలం మర్రిపాలెం అటవీ ప్రాంతం గుండా వెళ్లే సమయంలో ఆయనకు ఒక అనాధ శవం కనిపించింది.. అదే మార్గంలో నిత్యం వందల మంది వస్తూ వెళ్తూ ఉంటారు.. ఎవరు ఆ శవం వైపు కూడా చూడలేదు.. చూసిన వారు కూడా ఆ అనాధ శవం వల్ల తమకు వైరస్ సోకుతుందన్న భయంతో ఆ దరిదాపుల్లో నుంచి కూడా ఎవరు వెళ్లలేదు.. కానీ హెడ్ కానిస్టేబుల్ సురేష్ మాత్రం అలా అనుకోలేదు.. ఆ శవాన్ని భుజంపై మోసుకెళ్లి తన మానవత్వాన్ని చాటుకున్నడు..
ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల లో మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ కానిస్టేబుల్ అనాధ శవాన్ని చూస్తూ వదిలి వెళ్ళలేకపోయాడు.. ఎలాగైనా పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లాలి అనుకున్నాడు.. ఆ ప్రాంతంలో రోడ్డు మార్గం బాగోదు. ఆంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఎవరినైనా సహాయం అడిగినా రాలేదు. చివరికి ఒక మనిషిని పిలిచి కర్రకు శవాన్ని కట్టి.. భుజం పైకి ఎత్తుకున్నాడు.. రాళ్ళు, రప్పలు దాటుకుంటూ.. కొండలు ఎక్కి, దిగుతూ.. రెండు కిలోమీటర్లు నడిచిన తరువాత అంబులెన్స్ లో అనాధ శవాన్ని ఎక్కించి పోస్టుమార్టం నిమిత్తం దోర్నాల కు తీసుకెళ్లాడు.. అనాధ శవాన్ని తన భుజాలపై మోసిన సురేష్ అసలైన సమాజ సేవకుడునని నిరూపించుకున్నాడు.. కరోనా సమయంలో అనాధ మృతదేహాన్ని మానవతా దృక్పథంతో మోసుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ సురేష్ ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.