Potti Veeraiah: తెలుగు ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది.. మరుగుజ్జు నటుడు పొట్టి వీరయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రం 4: 33 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
పొట్టి వీరయ్య అసలుపేరు గట్టు వీరయ్య. విఠలాచార్య అగ్గి వీరుడు సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. పొట్టి వీరయ్య తెలుగు , తమిళ, కన్నడ భాషల్లో సుమారు 500 కు పైగా చిత్రాలలో నటించారు. దాసరి ప్రోత్సాహంతో తాతా-మనవడు చిత్రంలో కీలక పాత్రలో నటించిన పొట్టి వీరయ్య ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాడు.