యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి బాలీవుడ్ దర్శకుడు తో జతకడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే అతని తర్వాత చిత్రం ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’‘ అని అధికారికంగా వెల్లడించారు. రామాయణం నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రం చేస్తున్న ప్రభాస్…. దాని తర్వాత నాగ్ అశ్విన్ తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను కూడా సైన్ చేశాడు. ఈ లోపల ప్రభాస్ అభిమానులకు మరొక అప్డేట్ వచ్చిపడింది.
కెజిఎఫ్ లాంటి భారీ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ .ప్రభాస్ తో తన తరువాత చిత్రం ప్లాన్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అది కూడా రాధేశ్యామ్ చిత్రం చిత్రీకరణ పూర్తయిన వెంటనే ప్రభాస్ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు అని సమాచారం. అసలే కరోనా సమయం…. షూటింగులు మందకొడిగా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ‘ఆదిపురుష్’’ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం సంవత్సరం పైన పడుతుంది.
ఇక ప్రశాంత్ నీల్ ఎలాంటి సినిమా తీశాడో మనందరికీ తెలుసు. అతను కూడా కనీసం ఒక సంవత్సరంకి పైగా సమయం తీసుకుంటాడు. ఈలోపల నాగ అశ్విన్ డేట్ల కోసం కాచుకుని కూర్చుంటాడు. వీటన్నింటి మధ్య ఇప్పట్లో ‘ఆదిపురుష్’‘ షూటింగ్ జరుపుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంత కెజీఎఫ్ భారీ హిట్ సాధించిన ఎఫెక్ట్ అనే చెప్పాలి.
అయితే ప్రభాస్ కు ఈ మిగతా రెండు ప్రాజెక్టులతో పోలిస్తే ‘ఆదిపురుష్’’ చాలా ప్రతిష్టాత్మకమైనసి అని చెప్పాలి. జీవితంలో రాముడి పాత్ర పోషించే అవకాశం మళ్లీ మళ్లీ ఈ కండల వీరుడికి రాకపోవచ్చు. నాగ అశ్విన్, ప్రశాంత్ నీల్ తో ఫిక్స్ అయిన చిత్రాలు భారీ బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ ‘ఆదిపురుష్’ స్థాయి వేరు. ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా డార్లింగ్ కోసం లైన్ లో ఉన్నాయి కాబట్టి ప్రభాస్ అభిమానులకు ఒక రకంగా పండగే అయినా ‘ఆదిపురుష్’ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపించడం కొంచెం బాధించే విషయమే.